టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. మెగా, నందమూరి హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ తొలిసారిగా తెలుగు తెరపై కనువిందు చేయనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. మన టాలీవుడ్ సినిమా పరిశ్రమతో పాటు పలువురు కోలీవడ్, బాలీవుడ్, హాలీవుడ్ అగ్రనటులు కూడా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తుండగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని, కేకే సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. 

 

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై v v DANAYYA' target='_blank' title='డివివి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డివివి దానయ్య దాదాపుగా రూ.450 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ తో పాటు దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్, కొద్దిరోజుల క్రితం షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కాగా నేడు అజయ్ దేవగన్ తో కలిసి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు దర్శకుడు రాజమౌళి ప్రత్యేకంగా దిగిన ఫోటోలను ఆ సినిమా యూనిట్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. ఈ ముగ్గురితో మా ఆర్ఆర్ఆర్ మూవీ సెట్స్ ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి అంటూ మూవీ యూనిట్ వీరు దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. 

 

ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, అలానే రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను జులై 30న థియేటర్స్ లోకి తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆర్ఆర్ఆర్ యూనిట్ మాత్రం ఇప్పటివరకు ఈ విషయమై స్పందించలేదు. కాగా రాబోయే రోజుల్లో సినిమా రిలీజ్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: