పటాస్ నుండి ఎఫ్ 2 వరకు ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో కింగ్ అనిపించుకున్న డైరక్టర్ అనిల్ రావిపూడి. అయితే సరిలేరు నీకెవ్వరు మాత్రం ఆశించినంతగా హిట్ అవలేదు. దాంతో మహేష్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇదేది తనకి పట్టనట్టుగా ఎఫ్ 2 తో బాలీవుడ్ రీమేక్ కు వెళ్తారా? ఎఫ్ 3 చేస్తారా? అన్న సందేహం అందరిలోను నెలకొంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమానే చేయబోతున్నారట. ఇక నిర్మాత దిల్ రాజు అనే విషయంలో మాత్రం అసలు సందేహం లేదు.

 

అయితే ఎఫ్ 3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, రవితేజ ముగ్గురూ, హీరోలుగా నటిస్తారని ఎప్పటి నుంచో ఫిల్మ్ నగర్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఇందుకు పూర్తిగా భిన్నంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజ వుండడు అని తాజా వినిపిస్తున్న న్యూస్. ఇటీవల రవితేజ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి. అంతేకాదు గతవారం రిలీజైన డిస్కోరాజ కూడా రవితేజ కి గట్టి దెబ్బేసింది. మాస్ రాజా అస్సలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. ఎంత బజ్ వచ్చినప్పటికి డిస్కోరాజాకు మంచి ఓపెనింగ్స్ కూడా రాలేదు.

 

దాంతో రవితేజను ఎఫ్ 3 లో తీసుకుంటే సినిమాకు అంత బిజినెస్ వుండదని నిర్మాత దిల్ రాజు ఆలోచనలో పడ్డారట. అంతేకాదు మరో హీరోను ఎవరినైనా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది కాబట్టి అది పూర్తయ్యాక ఆ క్యారెక్టర్ కి ఏ హీరో సెట్ అవుతాడో ఆ హీరోను తీసుకువచ్చి ఎఫ్ 3 లో జాయిన్ చేయాలని చూస్తున్నారట. అయితే దిల్ రాజు-అనిల్ రావిపూడి మనసులో వున్న ఆ మూడో హీరో ఎవరు అన్నది ప్రస్తుతానికి  సస్సెన్స్ గానే వుంది. అది సినిమా స్క్రిప్ట్ పూర్తయి, ఆ హీరో ఓకె అన్న తరువాతే రివీల్ చేస్తారట. అయితే ఎఫ్ 3 మాత్రం ఖచ్చితంగా ముగ్గురు హీరోలతో తెరకెక్కనుందని క్లారిటి మాత్రం వచ్చేసింది. ఇక హీరోయిన్స్ ఎవరనేది మాత్రం చర్చకు రాలేదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: