టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా, ఆశించిన రేంజ్ లో విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ సినిమాలో హీరోగా నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి
ఎంతో వేగంగా ఆ సినిమా షూటింగ్ ని దగ్గరుండి మరీ పరిగెత్తిస్తున్నట్లు టాక్.

 

గతంలో మహేష్ తో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, ప్రభాస్ తో మిర్చి వంటి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తీసిన కొరటాల, ప్రస్తుతం మెగాస్టార్ తో తీస్తున్న సినిమాను కూడా మంచి మెసేజ్ తో, కమర్షియల్ హంగుల కలబోతగా తెరకెక్కిస్తునంట్లు సమాచారం. ఇక ఆ సినిమా కోసం ఇటీవల చాలా వరకు బరువు తగ్గారు మెగాస్టార్. ఇక ఎప్పటికప్పుడు కొన్ని సినిమా ఫంక్షన్స్ తో పాటు పలు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఎంతో చురుగ్గా పాల్గొనే అలవాటున్న మెగాస్టార్

 

నేడు తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు వేడుకల్లో ఒక చిన్నపిల్లాడి మాదిరిగా ఎంజాయ్ చేస్తూ గడిపినట్లు తెలుస్తోంది. తన సోదరి తో పాటు, భార్య సురేఖ, అలానే నాగబాబు భార్య పద్మజ లతో కలిసి తల్లి అంజనమ్మ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మెగాస్టార్, ఆమెతో ఎంతో ఆనందంగా కేక్ కట్ చేయించి, సరదాగా సెల్ఫీ కూడా దిగారు. కాగా మెగాస్టార్ ఎంతో ఆనందంగా దిగిన ఆ ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలను మెగా ఫ్యాన్స్  మరింత ఆనందంతో ఉప్పొంగిపోతూ తెగ లైక్స్, షేర్స్ చేస్తున్నారు. అయితే ఈ ఆనందభరిత వేడుకలో మెగాబ్రదర్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉంటె ఇంకా బాగుండేదని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: