బాలీవుడ్ నటి కంగనా రనౌత్, తన సోదరి రంగోలీ ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళకి ఇదొక వ్యాపకం లా అయిపోయింది. కంగన మంచి నటే అందులో ఎలాంటి అనుమానము లేదు. ఈ స్థాయికి రావడానికి ఎంత కష్ఠపడ్డారో కూడా అందరికి తెలిసిందే. బహుషా ఇలా కంగన స్థాయి కి చేస్రుకోవడానికి మరే హీరోయిన్ ఇంతగా స్ట్రగుల్ అవలేదేమో. అయితే అదంతా వీళ్ళు చేస్తున్న కామెంట్స్ వల్ల పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా కంగన సోదరి మరీ ఓవర్ గా బిహేవ్ చేస్తుంటుంది. అలానే మరోసారి నిర్మాత కరణ్ జోహార్‌పై కామెంట్స్ చేశారు. కరణ్ జోహార్‌కు, కంగనకు ఇటీవల భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనకు శుభాకాంక్షలు చెబుతూ కరణ్ ... కంగన తను నటించిన సినిమాలతో తన సత్తాను నిరూపించుకున్నారు. 

 

ఆమె పద్మశ్రీకి అర్హురాలే. ఓ ఆర్టిస్ట్‌గా ఆమె ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఆ గుణం నాకు చాలా నచ్చుతుంది. కంగనకు సరిపోయే కథ నా వద్ద ఉంటే కచ్చితంగా ఆమెకు ఫోన్ చేయడానికి ఏమాత్రం వెనుకాడను. నాకు, కంగనకు మధ్య శత్రుత్వం ఉంది చాలా మీడియా వర్గాలు రాశాయి. కానీ మేం ఏ ఈవెంట్‌లో కలుసుకున్నా ఎంతో సఖ్యతగా మాట్లాడుకుంటాము. ఓ నిర్మాతగా కంగన టాలెంట్ అంటే నాకు గౌరవం. మా గురించి ఎవరు ఎన్ని రకాలుగా రాసినా కంగనతో కలిసి పనిచేయడానికి నేను ఏమాత్రం ఆలోచించను అని వెల్లడించారు.

 

అయితే ఈ వ్యాఖ్యలపై కంగన సిస్టర్ రంగోలీ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘కరణ్ జోహార్ ఎలా మాట్లాడుతున్నారంటే.. ఆయన ఫోన్ చేయగానే కంగన పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందన్నట్లు ఫీలవుతున్నారు. మీరు నేను అనుకుంటే అయిపోదు కదా సర్. కంగనకు కూడా స్క్రిప్ట్ నచ్చాలి కదా. కంగనను మెప్పించేంత స్క్రిప్ట్ మీ దగ్గర ఉందా? మీరు తెరకెక్కించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాను కంగన చూసింది. అందులో క్యాన్సర్‌తో బాధపడుతున్న అనుష్క శర్మను రణ్‌బీర్ కపూర్ వెంటపడుతుంటాడు. నీకు ఇప్పుడు ఎటూ క్యాన్సర్ ఉంది ఇక నువ్వు నాతోనే ఉండాలి అంటాడు. ఈ సన్నివేశం చూశాక కంగన చాలా సేపటి వరకు షాక్‌లో ఉంది. మీరు ఇలాంటి చెత్త స్క్రిప్ట్స్ తీసుకుని కంగన వద్దకు వస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. అంటూ షాకింగ్ గా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. అయినా ఇలా కంగన సోదరి అనవసరమీన కామెంట్స్ చేయడమెందుకు అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: