‘ప్రతిరోజూ పండగే’ విడుదల తరువాత దర్శకుడు మారుతి ఆలోచనలు అన్నీ మారిపొయాయి అని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ ఊహించని ఘన విజయం అందుకోవడంతో మారుతి ఆలోచనలు అన్నీ మారిపోయి తన తలుపు తట్టిన 6 కోట్ల భారీ పారితోషికాన్ని మారుతి తిరస్కరించడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. 

‘ప్రతిరోజు పండగే’ మూవీ విడుదల అవ్వక ముందే నిర్మాత దానయ్య కుమారుడుని మారుతి దర్శకత్వంలో లాంఛ్‌ చేస్తున్నట్లు అందుకు గాను మారుతికి ఆరు కోట్ల పారితోషికం ఇస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ పెద్ద హిట్‌ అవడంతో ఇప్పుడు కొత్త హీరోతో సినిమా చేయడం రిస్క్ అని మారుతి భావించాడట. 

దీనితో మారుతి దానయ్య బ్యానర్లోనే ప్రముఖ హీరోతో చేద్దామని కొడుకును లాంచ్ చేసే ఆలోచనలను వద్దని మారుతి దానయ్యకు సలహా ఇచ్చినట్లు టాక్. అంతేకాదు నితిన్‌ విజయ్‌ దేవరకొండ వరుణ్‌ తేజ్‌ లాంటి హీరోలతో తాను సినిమాను చేయడానికి రెడీ అంటూ ఆ హీరోలకు మెసేజ్ లు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే ప్రస్తుతం మారుతి కోరుకునే హీరోలు అంతా బిజీగా ఉండటంతో మారుతి కోరిక నెరవేరడం లేదు అని అంటున్నారు. ఒకవైపు అరవింద్ తన చిన్న కొడుకు శిరీష్ తో సినిమా చేయమని చెపుతున్నా మారుతి పట్టించుకోకుండా ఇలా మిడిల్ రేంజ్ హీరోల పట్ల మోజు పెంచుకుంటూ గుమ్మంలోకి వచ్చిన ఆరు కోట్లను పోగొట్టుకుంటున్నాడు అంటూ మారుతి పై జోక్స్ పేలుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం మారుతి వైపు ఏ హీరోలు చూడటం లేదు కాబట్టి మారుతికి మార్కెట్‌ రేట్‌ కంటే రెండు కోట్లు ఎక్కువ చెల్లిస్తే దానయ్య తనయుడిని లాంఛ్‌ చేయడానికి ఓకే అంటాడేమో అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. దీనితో సక్సస్ వచ్చినా ఆనందం లేకుండా మారుతి తెగ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: