సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతుంది. కానీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించటం లేదు. మహేష్ బాబు హీరోగా నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. టాలీవుడ్ లో వరుస హిట్లు అందుకుంటున్న ఒక స్టార్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.         
 
ఈ మధ్య కాలంలో అన్నపూర్ణ బ్యానర్లో తన సినిమాలను, తన కొడుకుల సినిమాలను మాత్రమే ఎక్కువగా నిర్మిస్తున్న నాగార్జున ఈసారి మాత్రం అందుకు భిన్నంగా స్టార్ హీరో మహేష్ బాబుతో సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సంవత్సరం చివరలో ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుందని సమాచారం. నిజానికి గతంలో మహేష్ బాబు, నాగార్జున హీరోలుగా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. 
 
కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. మణిరత్నం దర్శకత్వంలో మహేష్ బాబు, నాగార్జున హీరోలుగా శృతిహాసన్, ఐశ్వర్యారాయ్ హీరోయిన్లుగా ఒక సినిమా మొదలవుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత ఎందుకో ఈ సినిమా పట్టాలెక్కలేదు. కొంతకాలం తరువాత ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ఆగిపోగా నాగార్జున, మహేష్ బాబు ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీ అయిపోయారు. 
 
మహేష్ బాబు హీరోగా నాగార్జున నిర్మాతగా సినిమా తెరకెక్కటం అంటే అటు మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇటు నాగార్జున ఫ్యాన్స్ కు శుభవార్త అనే చెప్పవచ్చు. అధికారికంగా ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒక స్టార్ హీరో సినిమాను మరో స్టార్ హీరో నిర్మిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: