దివంగత అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఇప్పటికే రెండేళ్లు గడుస్తున్నాయి. కాలం ఎంత గతించినా, మన ప్రేక్షకుల్లో ఆమె గుర్తులు ఎప్పటికీ ఎన్నటికీ చెరిగిపోవనే చెప్పాలి. తెలుగుతో పాటు హిందీ సహా పలు ఇతర సౌత్ భాషల్లో కూడా నటించి మంచి పేరు దక్కించుకున్న శ్రీదేవి, ఆ తరువాత కొంత కాలానికి బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకున్నారు. ఇక వివాహానంతరం సినిమాలు కొంత తగ్గించిన శ్రీదేవి, ఇటీవల తన పెద్ద కూతురు జాన్వీని హీరోయిన్ గా వెండితెరపై చూడాలనుకున్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే ఆమె అర్ధాంతరంగా అనంతలోకాలకేగారు శ్రీదేవి.
అయితే ఆ తరువాత దఢక్ అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, తొలి సినిమా నుండి తనకంటూ కొంత ప్రత్యేక గుర్తింపుతో ముందుకు సాగుతోంది. ఇటీవల ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించిన జాన్వీ, ప్రస్తుతం గుంజన్ సక్సేనా అనే సినిమాలో నటిస్తోంది. ఇకపోతే కొన్నాళ్ల క్రితం కేంద్ర మాజీ మంత్రి సుశీల్కుమార్ షిండే మనవడు శిఖర్ తో రహస్య ప్రేమాయణం నడిపిన జాన్వీ, తమ మధ్య ఏమి లేదంటూ అప్పట్లో ఆ వార్తలను కొట్టిపారేసింది. అయితే నిన్నటి నుండి జాన్వీ మళ్ళి ప్రేమలో పడింది అంటూ బాలీవుడ్ లో వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఆమె ప్రేమలో పడింది మరెవరితోనో కాదు,
తన మాజీ ప్రియుడు శిఖర్ తో అని తెలుస్తోంది. నిజానికి ఆమె శిఖర్ తో తల్లి శ్రీదేవి బ్రతికి ఉన్న టైం నుంచే ఎంతో చనువుగా ఉండేదని, అయితే తమ మధ్య ఏమి లేదని ఆ మధ్య కొట్టిపారేసిన జాన్వీ, నిన్న తన వాట్సాప్ డీపీగా శిఖర్ ఫోటో పెట్టడంతో వారిద్దరూ కూడా ప్రేమలో ఉన్న ట్టు సంకేతాలు ఇచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎంతో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త మాత్రం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది......!!