తెలుగు వారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సెల‌వులు అంద‌రికి అయిపోయాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు సంబంధించిన సెల‌వులు కూడ అయిపోయి, ఇప్పుడు అంద‌రూ షూటింగ్ బాట‌ ప‌ట్టారు. ఇదిలా ఉంటే బాహుబ‌లి మూవీ సైతం పండుగ సెల‌వులు ముగించుకొని ఈ రోజు షూటింగ్‌ను జ‌రుపుకుంటుంది. ఎప్పటిలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబ‌లి మూవీకు సంబంధించిన యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే బాహుబ‌లి మూవీ కోసం స్టార్ డైరెక్టర్ రాజ‌మౌళి ఓ లొకేష‌న్‌ను సంవ‌త్సరం పాటు లీజ్‌కు తీసుకున్నాడ‌ని టాల‌వుడ్ నుండి అందిన స‌మాచారం. రాజ‌మౌళి సంవ‌త్సరం రోజుల పాటు లీజ్‌కు తీసుకున్న ఆ లొకేష‌న్ ఎక్కడిదో కాదు. మ‌న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీయే. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ భారీ లొకేష‌న్‌ను సంవ‌త్సరం పాటు సింగిల్ పేమంట్‌లో లీజ్‌కు తీసుకున్నట్టుగా బాహుబ‌లి చిత్ర యూనిట్ నుండి అందిన స‌మాచారం. అందుకే రామోజీ ఫిల్మ్ సిటిలో బాహుబ‌లి మూవీ రెండు పార్ట్‌ల‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను ముందుగా చిత్రీక‌రించేందుకు రాజ‌మౌళి షెడ్యూల్ ప్లానింగ్స్ వేసుకున్నాడ‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. రామోజీ ఫిల్మ్ సిటిలో వేసిన అతి పెద్ద సెట్స్‌ను సైతం రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు సైతం అభినందించాడు. మొత్తంగా రామోజీ ఫిల్మ్ సిటిలోని లోకేష‌న్‌ను సంవ‌త్సరం పాటు లీజ్‌కు తీసుకున్న మొద‌టి వ్యక్తి రాజ‌మౌళీనే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: