తెలుగు నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎప్పుడు కూడా వెనకాడరనే విషయం తెల్సిందే. ఆ విషయం సూపర్ స్టార్ మహేష్ తో గుణశేఖర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమాలో చార్మినార్ సెట్ వేయడానికి నిర్మాత ఎం.ఎస్.రాజు ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయలేదు. ఒక్కడు సినిమాకి ప్రధాన ఆకర్షణ మహేష్ తర్వాత చార్మినార్ సెట్టేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత మహేష్ గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ సినిమాలో మధుర meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి ఆలయం నిర్మించారు. ఈ సెట్ లో షూటింగ్ జరిగినన్ని రోజులు చిత్ర యూనిట్ ఎంతో నిష్ఠగా ఉన్నారట.

 

కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా రోజంతా షూటింగ్ చేయడం విశేషం. ఈ సెట్ ని గండిపేట్ దగ్గర్లోని ఒక తోటలో ఈ ఆలయన్ సెట్ ని ఎంతో గొప్పగా నిర్మించారు. ఈ సెట్ ని షూటింగ్ కంలీటయ్యాక కూడా చాలా కోసం సందర్శకుల కోసం ఉంచారు. ఇక ఈ సినిమా కంటే పవన్ కళ్యాణ్ నటించిన సిల్వర్ జూబ్లీ సినిమా, హిస్టరీ రికార్డ్ మూవీ తొలిప్రేమ సినిమా కోసం తాజ్ మహల్ సెట్ ని నిర్మించారు. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ సెట్ బ్యాగ్డ్రాప్ లో పవన్  కీర్తి రెడ్డి ల మీద సాంగ్ ని షూట్ చేశారు. ఆ సాంగ్ సినిమాలో ఎంతో హైలెట్ గా నిలిచింది.  

 

ఇక ఇప్పుడు మరో సారి పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'పింక్' రీమేక్ కు కోసం తాజ్ మహల్ సెట్ ని వేస్తున్నారని తాజా సమాచారం. ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ ను కేటాయించినట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్ కి ఉన్న రాజకీయ, ఇతర సినిమాల కమిట్ మెంట్స్ దృష్ఠ్యా ఈ సినిమా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేఅయలనే ఉద్దేశ్యంతో ఔట్ డోర్ షూటింగ్స్ కంటే ఎక్కువగా భారీ సెట్టింగ్స్ వేసి ఇండోర్ లోనే టాకీ పార్ట్ ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట. అందుకే ఈ సినిమాలోని కీలక సన్నివేశాల కోసం భారీ స్థాయిలో తాజ్ మహల్ సెట్టింగ్ ను వేయబోతున్నారట. అంతేకాదు ఇదే సినిమాకోసం చార్మినార్ సెట్టింగ్ ను కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమీనియం ఫ్యాక్టరీ లో ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఈ సెట్టింగ్స్ ను నిర్మించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాట. అలాగే సినిమా లో కీలకమైన ఇతర సీన్స్ తీసేందుకు కోర్టు సెట్ తో పాటు మరికొన్ని స్ట్రీట్ సెట్స్ ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బడ్జెట్ పెరుగుతున్నప్పటికి నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలన్న కోరికని దిల్ రాజు ఈ సినిమాతో తీర్చుకుంటున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ తాజ్ మహల్ సెట్ ని సెంటిమెంట్ గా ఫీలవుతున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. అదే గనక నిజమైతే పింక్ మిగతా భాషలతో సంబంధం లేకుండా పెద్ద హిట్ అవ్వాలి మరి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: