గతంలో పవన్ కళ్యాన్ సినిమాలలో మాత్రమే నటించే సమయంలోనూ ఒకేసారి రెండు సినిమాలు ఎప్పుడు చేయలేదు. ఒక సినిమా అయ్యాక నింపాదిగా రెండవ సినిమాని మొదలు పెట్టేవారు.  కానీ ఇప్పుడు షాకుల మీద షాకులిస్తున్నాడు. ప్రస్తుతం రాజకీయాలలో పరిస్థి దారుణంగా ఉండటటంతో మళ్ళీ సినిమాలు మొదలు పెట్టారు.  దిల్ రాజు నిర్మిస్తున్న హిందీ పింక్ రీమేక్ షూటింగ్ ఇప్పటికే మొదలై చక చక షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో పవన్ సంబంధించిన పిక్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాకి బడ్జెట్ బారీగానే పెడుతున్నారు. పవన్ కోసం ఏర్పాటు చేస్తున్న స్పెషల్ ఫ్టైట్స్ కోసమే సగం బడ్జెట్ అవుతుందన్న మాట వినిపిస్తోంది.

 

దిల్ రాజు సినిమాకు కేవలం పాతిక రోజుల కాల్షీట్లు ఇచ్చాడు పవన్. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే.. క్రిష్ తెరకెక్కించే సినిమాలో జాయిన్ అవుతారు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంతన్న దానిపై ఆసక్తికర సమాచారం తాజాగా బయటకు వచ్చింది. స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథాంశంతో ఈ సినిమా ఉంటుందని ముందునుంచి చెబుతు వస్తున్నారు. అందుకే బడ్జెట్ రూ.100 కోట్ల పైనే కేటాయించారట. పాతిక కోట్లు పెట్టి భారీ సెట్టింగ్ కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది.

 

చాలా తక్కువ టైం లో తక్కువ బడ్జెట్ లో ఇప్పటికే గౌతమి పుత్ర శాతకర్ణి.. మణికర్ణిక లాంటి సినిమాలు తీసి.. మేకింగ్ పరంగా గ్రేట్ అని ఫ్రూవ్ చేసుకున్నారు క్రిష్. అందుకే ఈ సినిమాను బాగా డీల్ చేస్తాడన్న ఉద్దేశంతోనే ఇంత భారీగా ఖర్చు చేస్తారని చెబుతున్నారు. ఫిబ్రవరి 4న నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని.. తొలి షెడ్యూల్ ను పవన్ లేకుండానే పూర్తి చేస్తారని తాజా సమాచారం. ఈ సినిమా కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్టింగ్ వేయనున్నారట. 2021 సంక్రాంతికి విడుదల ఈ సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియాగా రూపొందించి భారీగా వసూళ్ళు రాబట్టుకోవాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి 100 కోట్లకే పాన్ ఇండియా సినిమా అంటే సాహో ఏ తరహా సినిమా అంటూ కొంతమంది సెటైర్స్ వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: