యువ హీరో నాగ శౌర్య లీడ్ రోల్ లో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన సినిమా అశ్వద్ధామ. రమణ తేజ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు నాగ శౌర్య కథ అందించడం విశేషం. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాలో ఆయన వాయిస్ ఓవర్ తోనే మొదలవడం విశేషం. కురుక్షేత్రంలో అశ్వద్ధామ గురించి పవన్ చెప్పడం సినిమా మొదలు పెట్టడమే బాగుందని అనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ సినిమాలో ఉందన్న విషయం నాగ శౌర్య ప్రమోషన్స్ లో ఎక్కడా చెప్పలేదు.

 

సినిమా ప్రమోషన్స్ లో చాలా సర్ ప్రైజులు ఉన్నాయని హింట్ ఇచ్చినా ఆడియెన్స్ కాస్త కూస్తో ఎక్సయిట్ అయ్యే వారు.. నాగ శౌర్య సినిమాకు వెళ్తే పవన్ వాయిస్ ఓవర్ రావడం నిజంగానే సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇక అశ్వద్ధామ సినిమా టాక్ విషయానికొస్తే సినిమా కథ రొటీన్ అని తెలుస్తుంది. అయితే స్క్రీన్ ప్లే కొంతమేరకు బెటర్ అని అంటున్నారు. ముఖ్యంగా నాగ శౌర్య తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడని తెలుస్తుంది. సినిమాలో నాగ శౌర్య సరసన నటించిన మెహ్రీన్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదని తెలుస్తుంది.

 

ఇక పవన్ విషయానికి వస్తే పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాన్ ఈమధ్యనే పింక్ రీమేక్ మొదలు పెట్టాడు. క్రిష్ డైరక్షన్ లో సినిమా కూడా ఆయన లేకుండానే ముహుర్తం పెట్టారట. మళ్లీ పవన్ సినిమాల్లో బిజీ అవనున్నాడు. ఇలా అడపాదడపా యువ హీరోలను ఎంకరేజ్ చేస్తూ వారి సినిమాలకు కవాల్సిన సపోర్ట్ ఇస్తున్నారు. పవన్ వాయిస్ అశ్వద్ధామలో ఉందన్న విషయం తెలిస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: