రెండుపట్టాలు ఎలా కలువలేవో నందమూరి ఫ్యామిలీలో ఉన్న ఈ బాబాయ్ అబ్బాయ్‌లు కూడా అలా కలువలేరని అనుకుంటున్న వారి గుండెలు గంటల్లా మోగే శుభవార్త. ఈ వార్త ఒకరకంగా నందమూరి అభిమానులందరికి వర్తిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గాని, ఇప్పుడొక వార్త టాలీవుడ్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. అదేమంటే బాలకృష్ణ, జూనియర్ ఎన్‌టీయార్ కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారని ఒక టాక్ గాలికంటే వేగంగా అందరి నోళ్లల్లో నానుతుంది.

 

 

ఇకపోతే చాలా కాలం నుండి ఎడమోహం పెడమోహంగా ఉండే ఈ నందమూరి సింహాలు కలిసి నటిస్తే చూడాలని అనుకోని అభిమాని ఉంటారా. అదీ కాకుండా హరికృష్ణ మరణం కంటే ముందు వరకు కూడా బాలయ్య, జూనియర్ మధ్య అంతగా మాటలు ఉండేవి కాదని, కానీ అన్నయ్య మరణం తర్వాత అబ్బాయిలతో కలిసిపోయిన బాలయ్య. వాళ్లకు పెద్దదిక్కు అయ్యాడు అన్నట్లుగా అప్పుడప్పుడు వినిపిస్తుంది..

 

 

అయితే వీరి కాంబినేషన్లో సినిమాని త్రివిక్రమ్ తన దర్శకత్వంలోనే చేయాలని అనుకుంటున్నాడట. ఇక త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తలుచుకుంటే ఇది పెద్ద కష్టమేం కాదంటున్నారు ఫ్యాన్స్ కూడా.  ప్రస్తుతం అల వైకుంఠపురములో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ దర్శకుడు.. త్వరలోనే ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడు. దీనికి అయననూ పోయిరావలే హస్తినకు అనే క్లాస్ టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా తారక్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అవ్వగానే ఈ సినిమా మీద దృష్టి పెట్టె అవకాశం ఉందని మరొక సమాచారం.

 

 

ఇకపోతే ఈ చిత్రానికి నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఉండే అవకాశాలు కనిపిస్తుండగా, ఈ సినిమాను వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఎవరెన్ని చెప్పినా కూడా నందమూరి వారసులు కలిసి నటిస్తారా అనేది ప్రశ్నార్థకమే. గతేడాది ఎన్టీఆర్ బయోపిక్‌లో కళ్యాణ్ రామ్‌తో కలిసి నటించాడు బాలయ్య. ఇప్పుడు మరో అబ్బాయితో కూడా నటిస్తాడేమో చూడాలిక. కానీ అదంతా ఈజీ మాత్రం కాదు.. నిజమైతే మాత్రం తెలుగు ఇండస్ట్రీలో అంతకంటే అద్భుతం మరోటి ఉండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: