త్రివిక్రమ్ శ్రీనివాస్ కు నాగార్జున కు ఒక చిన్న గ్యాప్ ఉంది అన్న విషయం ‘మన్మధుడు 2’ మూవీ ప్రమోషన్ లో నాగ్ మాటలను బట్టి అర్ధం అవుతుంది. నాగార్జున కెరియర్ బెస్ట్ మూవీ ‘మన్మధుడు’ అప్పట్లో త్రివిక్రమ్ వ్రాసిన మాటలు వల్ల హిట్ రాలేదని ఆ మూవీ దర్శకుడు సమర్థత వల్ల హిట్ అయింది అంటూ నాగ్ చేసిన కామెంట్స్ కొంత కాలం క్రితం సంచలనాలను సృష్టించాయి. 

ఇప్పుడు రికార్ధులను సృష్టిస్తున్న ‘అల వైకుంఠపురములో’ నాగ్ తన మేనల్లుడు శుశాంత్ కు అన్యాయం జరిగింది అంటూ తన సన్నిహితుల వద్ద బాథ పడుతున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. దీనికి కారణం ‘అల’ మూవీలో శుశాంత్ కు పట్టుమని నాలుగు డైలాగులు కూడ లేకపోవడం. 

ఈ మూవీలో శుశాంత్ పాత్ర ఇంత చిన్నది కాదనీ అయితే ఈ మూవీ ఎడిటింగ్ లో శుశాంత్ పాత్రకు బాగా కటింగ్ పడిందని అంటారు. వాస్తవానికి ఈ మూవీ కథను త్రివిక్రమ్ రాసినప్పుడు ఇద్దరి హీరోల మల్టీ స్టారర్ గా ఈ మూవీ కథ తయారైందని అయితే ఎప్పుడైతే బన్నీమూవీ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాడో మొత్తం కథ అంతా బన్నీ చుట్టూ తిరగడంతో శుశాంత్ పాత్ర డమ్మీగా మారిపోయింది అన్న వార్తలు ఉన్నాయి. 

ఈ విషయాలు అక్కినేని యంగ్ హీరో గ్రహించడంతో షాక్ అయినప్పటికీ ఏమి చేయలేని పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించిన ఏ ఫంక్షన్ కు శుశాంత్ రాలేదు అన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఈ మూవీ మీడియా మీట్స్ లో కూడ శుశాంత్ ఎక్కడా కనిపించక పోవడం ఈ గాసిప్పులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇది ఇలా ఉంటే నిన్న ఈ యంగ్ హీరో నటిస్తున్న కొత్త మూవీ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ ఫస్ట్ లుక్ విడుదల చేసి తాను డమ్మీ ని కాదు హీరో ని అని మరొకసారి రుజువు చేసుంటున్నాడు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: