బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు.  ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు దర్శకుడు జగన్‌శక్తి ఆయనను వెంటనే ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు .విషయం తెలుసుకున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్,జగన్ కు అండగా నిలిచాడు. ఆసుపత్రి వైద్య ఖర్చులను భరిస్తూ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. అక్షయ్ మొదటి నుంచి  దర్శకులతో పాటు తనతో సినిమాలు తీసిన వారితో ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే.  ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేయడంలో అస్సలు వెనకడుగు వేయరు. అక్షయ్‌కుమార్‌ హీరోగా జగన్‌శక్తి దర్శకత్వంలో ‘మిషన్‌మంగళ్‌’ సినిమా చేశారు. ఆ దర్శకుడు ఓ శుభకార్యంలో పాల్గొన్న సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. 

ఇటీవల ఓ శుభకార్యంలో పాల్గొన్న దర్శకుడు జగన్ మెదడులో రక్త గడ్డ కట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను ముంబైలోని ఆసుపత్రిలో చేర్చి అత్యవసర వైద్య సాయం అందిస్తున్నారు.జగన్ శక్తి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ఇటీవల ‘మిషన్ మంగళ్’ చేశాడు. తన దర్శకుడికి  చికిత్సకు కావాల్సిన ఖర్చులు భరిస్తున్నారు. అంతేకాదు బాధిత కుటుంబానికి నిత్యం అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూసుకోవాలని తన సిబ్బందికి సూచించారట. 

కాగా..  జగన్‌శక్తి  ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిసింది. కాగా, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి ఈ మద్య వరుసగా కలిసి వస్తుంది. ఆ  మద్య రజినీకాంత్ నటించిన రోబో 2.0 లో ప్రతినాయకుడిగా నటించారు.  మరో దక్షిణాది సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే అక్షయ్ కుమార్ చేస్తున్న సహాయానికి బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని సినీ పరిశ్రమలు ఎంతో మెచ్చుకుంటన్నారు. ఇలాంటి హీరో నిజంగానే ఉండటం చాలా గొప్ప విషయం అని అంటున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: