ఇండస్ట్రీలోకి వారసులు వరుసగా వచ్చేస్తున్నారు. రోజుకో కొత్త ముఖం ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. అందులో వారసులే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్నినిర్మిస్తున్న డివివి దానయ్య వారసుడు డివివి కళ్యాణ్ కూడా అతి త్వరలో తెర మీదకి రాబోతున్నాడు. కళ్యాణ్ హీరోగా రావడం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మారుతి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అవబోతుందనే వార్తలు కూడా వచ్చాయి.

 

 

 

 

మారుతి దానయ్య వద్ద అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు చెప్పారు. అయితే సడెన్ గా ఏమయిందో తెలియదు.. దర్శకుడు మారాడని అంటున్నారు. మరి అంత సడెన్ గా దర్శకుడిని మార్చడానికి కారణం ఏమై ఉంటుందనేది మాత్రం తెలియదు. అయితే కొత్త దర్శకుడిగా శ్రీవాస్ ని తీసుకున్నారట. శ్రీవాస్ గ్రాఫ్ ని పరిశీలిస్తే ఎక్కువగా ఫ్లాప్ చిత్రాలే కనబడుతున్నాయి. ఆయన చివరి చిత్రమైన సాక్ష్యం ఎంతటి డిజాస్టర్ అయిందో తెలిసిందే.

 

 

 

 

శ్రీవాస్ కి హిట్లు లేవని కాదు. గోపీచంద్ తో తీసిన లక్ష్యం, లౌక్యం మంచి విజయాలు సాధించాయి. కానీ అలాగే అతని కెరీర్లో పాండవులు పాండవులు తుమ్మెద, డిక్టేటర్ లాంటి డిజాస్టర్లు కూడా ఉన్నాయి. మరి ఫ్లాప్ సినిమాలు తీసిన దర్శకుడి చేత కొత్త హీరోని లాంఛ్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి.  శ్రీవాస్ చెప్పిన కథ పర్ఫెక్ట్ గా ఇంప్రెస్ చేసిందని అందుకే మారుతి స్థానంలో అతడిని ఎంపిక చేశారని తెలుస్తోంది.

 

 

 

 

 

 శ్రీవాస్ తెరకెక్కించిన వాటిలో మాస్ యాక్షన్ చిత్రాలే ఎక్కువ కాబట్టి .. డీవీవీ నట వారసుడిని ఆ తరహా కథాంశంతోనే పరిచయం చేస్తున్నాడా? అన్నది చూడాలి. మరి కొత్త హీరోతోనైనా శ్రీవాస్ హిట్ కొడతాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: