సంక్రాంతి పండుగ అనగానే ఇంటికి కొత్త అల్లుళ్ళ తో పాటు చుట్టాల రాక, అలానే ఇంటినిండా ఆనందంతో అందరూ ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక తెలుగు వారు ఎంతో గొప్ప జరుపుకునే ఈ అతి పెద్ద పండుగ సమయంలో తెలుగు సినిమాల విడుదలలు కూడా బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక మొన్నటి సంక్రాంతి సమయంలో దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో, ఎంత మంచివాడవురా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని అలరించాయి. అయితే వాటిలో సరిలేరు, అల సినిమాలు మంచి విజయాలు అందుకోగా, దర్బార్ యావరేజ్ గా, అలానే ఎంత మంచివాడవురా సినిమా పర్వాలేదనిపించేలా విజయాలు అందుకున్నాయి. 

 

ఇకపోతే ఈ సంక్రాంతిని మించేలా రాబోయే సంక్రాంతి పండుగకు టాలీవుడ్ నుండి ముగ్గురు బడా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మొన్న సంక్రాంతికి సరిలేరు తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్, రాబోయే సంక్రాంతికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే సినిమాతో రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీ బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, దాని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వేసవి లో ప్రారంభం కానున్న ఆ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు టాక్. ఇక వీరిద్దరితో పాటు ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పొంగల్ బరిలో నిలుస్తున్నట్లు టాక్. 

 

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ సినిమా రీమేక్ లో నటిస్తున్న పవన్, దాని అనంతరం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటించననున్నారు. మొన్న ఒకింత నార్మల్ గా అధికారిక పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాను సమ్మర్ లో పట్టాలెక్కించి సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనుందట సినిమా యూనిట్. సో, దీనిని బట్టి ఏకంగా ముగ్గురు స్టార్ సినిమాలతో రాబోయే పొంగల్ కు టాలీవుడ్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ కిక్ అందనుందన్నమాట.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: