సాధారణంగా మన హీరోలకు దర్శకులు.. హీరోయిన్స్ నిర్మాతలు కలిసొస్తారు. ఒక సినిమా హిట్ అయితే.. వీళ్లనే రిపీట్ చేస్తారు. విశేషం ఏంటంటే..మన హీరోలకు సెట్స్ కూడా కలిసొస్తాయి. పవన్ కళ్యాణ్ త్వరలో తనకు కలిసొచ్చిన సెట్ లోకి అడుగుపెడుతున్నాడు. 


పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ మూవీ ఈ మధ్యనే లాంఛనంగా మొదలైంది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ కు వెళ్తుంది. ఈ లోగా.. సినిమా కోసం తాజ్ మహల్, ఛార్మినార్ సెట్ వేయిస్తున్నారు. ఔరంగజేబు కాలం నాటి కథ కావడంతో.. తాజ్ మహల్ కు ఇంపార్టెంట్ ఉందని తెలిసింది. దీంతో హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తాజ్ మహల్.. చార్మినార్ సెట్స్ వేయిస్తున్నాడు దర్శకుడు. తొలిప్రేమలో పాట కోసం వేసిన తాజ్ మహల్ సెట్ ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. 

 

పవన్ కళ్యాణ్ కంటే ముందే మహేశ్ కు సెట్స్ కలిసొచ్చాయి. మహేశ్ ను స్టార్ ను చేసిన సినిమా ఒక్కడు. సినిమాలో కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర తీసిన సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. 

 

సరిలేరు నీకెవ్వరులో కొండారెడ్డి బురుజు కీలకం కావడంతో.. కర్నూలు వెళ్లి చాలా రోజుల పాటు షూటింగ్ చేయడం జరిగేపని కాదు. దీంతో ఫిలింసిటీలో ఏకంగా కొండారెడ్డి బురుజును ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ప్రతిష్టించాడు. కొండారెడ్డి బురుజు నీకు కలిసొచ్చిందబ్బాయ్ అంటూ.. మహేశ్ ను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ అంటాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద 100కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. కొండారెడ్డి బురుజు సెంటిమెంట్ ను రుజువు చేసింది. మొత్తానికి కొండారెడ్డి బురుజు మహేశ్ బాబుకు బాగానే కలిసొచ్చింది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడానికి ఈ నిర్మాణమే అధృష్టంగా నిలిచిందని సినిమా యూనిట్ చెబుతోంది. ఇపుడు ఇదే సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ కు వర్కవుట్ అవుతుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: