నచ్చావులే సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు  పరిచయమైనా నటి మాధవీ లతా. ఆ ఒక్క సినిమా ద్వారానే ఆమె అమిత మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుందంటే అతి సయోక్తి కాదు. ఆ సినిమా తర్వాత నాని తో చేసిన స్నేహితుడా సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాలనే పొందింది. ఆ సినిమా తర్వాతా అడపా దడపా సినిమాలు చేసి నప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు.

 

  కర్ణాటకలో పుట్టినప్పటికీ తెలుగు ఆడపిల్లలా చూడ చక్కగా  ఉండే మాధవీలతకు సరైన అవకాశాల రానందుకు ఆమె ఎంత గానో బాధ పడేది. కొన్ని కొన్ని సార్లు ఆమె తన అసహనాని బాహాటం గానే వ్యక్త పరిచిన సందర్భాలు లేకపోలేదు.

 

   మీటు ఉద్యమం జరుగుతున్న సమయంలో తనకు ఇండస్ట్రీలో ఎదురైనా చేదు అనుభవాలను ప్రజలకు తెలియజేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన సినిమా జీవితం అయిపోయింది అనుకుంటున్న తరుణంలో, తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని చెప్పి కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మాట్లాడుతూ, చివరకు బీజీపీ కండువా కప్పుకొని సుఖంగా వుంది లే అని తన అభిమానులు అనుకొనే లోపే, నిన్న సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఉన్నట్టుండి నాకు చనిపోవాలని ఉంది అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. 
  
 

   దీనితో కంగారు పడిన ఆమె అభిమానులు ఆమెను వివరణ కోరగా, ‘నేను మైగ్రేన్ వల్ల ఇన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కాబట్టి నేను కూడా ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చనిపోతానేమోనని అన్నాను కానీ చనిపోవాలని అనుకుంటున్నట్లు మాత్రం ఎక్కడా చెప్పలేదు. తప్పుగా ప్రచారం చేయకండి. నాకు ఒంట్లో బాలేదు. మెడిసిన్స్ ఎక్కువగా వాడటం వల్ల విరక్తి కలిగి ఆ పోస్ట్ పెట్టాను, అని చెప్పడం తో ఆమె అభిమానులు నవ్వాలో ఏడవాలో తెలియక సత మత మౌతూ ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: