ఒక సినిమా సూపర్ హిట్ అవ్వగానే మన ఆడియెన్స్ ఆలోచించే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆ సినిమా సీక్వల్ ప్లానింగ్ ఏదైనా ఉందా అని.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు దర్శక నిర్మాతలు ముందుగానే ఇలాంటి ప్లాన్ వర్క్ అవుట్ చేసుకుని ఉంటారు. సినిమాపై ప్రేక్షకుల అంచనాలు బాగా ఉండి.. బజ్ క్రియేట్ అయితే సినిమా చివరన ఎండ్ కార్డ్ లో పార్ట్ 2 అని కూడా వేస్తారు. అయితే సినిమా ఫలితాన్ని బట్టి ఆ సీక్వల్ ఉంటుందా లేదా అన్నది నిర్ణయిస్తారు. అయితే అలా ఎనౌన్స్ చేయకపోయినా సరే ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వల్ అంటూ ప్రచారం చేయడం మీడియాకు కొత్తేమి కాదు.

 

లేటెస్ట్ గా సంక్రాంతికి వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ అల వైకుంఠపురములో సినిమా అటు అల్లు అర్జున్ కెరియర్ లోనే కాదు త్రివిక్రం కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బన్ని చాలా కొత్తగా కనిపించాడు. అయితే సినిమా వచ్చింది సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో.. అల్లు అర్జున్ సుకుమార్ తో సినిమాలకు రెడీ అవుతున్నారు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం అల్లు అర్జున్, త్రివిక్రం మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారట.

 

అంతేకాదు వారు చేసే ఈ నాల్గవ సినిమా అల వైకుంఠపురములో సీక్వల్ గా చెప్పుకుంటున్నారు. సీక్వల్ చేసే మ్యాటర్ అల వైకుంఠపురములో సినిమాలో ఉందా అంటే లేదు కాని మన మాంత్రికుడు త్రివిక్రం ఏదైనా చేయగలడు కాబట్టి దాన్ని కొనసాగింపుగా ఒక లైన్ అనుకుని దానితో సినిమా నడిపించేస్తాడు. అవును గురూజీకి ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఈ వార్తలపై ఆడియెన్స్ కూడా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. మరి నిజంగానే అల వైకుంఠపురములో సీక్వల్ ఉంటుందా లేదా అన్నది చిత్రయూనిట్ స్పందిస్తేనే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: