టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కెరటం అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, ఆ తరువాత సందీప్ కిషన్ తో నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక ఆపై గోపీచంద్ తో ఆమె నటించిన లౌక్యం సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడంతో టాలీవుడ్ లో రకుల్ కు వరుసగా అవకాశాలు పెరిగాయి. ఆ తరువాత పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, బ్రూస్ లీ, సరైనోడు, కిక్ 2, ధ్రువ, విన్నర్ తదితర సినిమాల్లో అవకాశాలు అందుకున్న రకుల్, కొన్ని ఫ్లాప్స్ తో పాటు మధ్యలో హిట్స్ కూడా అందుకుంది. 

 

ఇక తెలుగులో ఆమె నటించిన సినిమా గత ఏడాది కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు2. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇక్కడ రకుల్ కు పూర్తిగా అవకాశాలు సన్నగిల్లాయి. నిజానికి మూడేళ్ళ క్రితం సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న రకుల్ కు ఆ సినిమా భారీ దెబ్బేసింది. ఇక ఆ తరువాత ఆమెకు తెలుగులో వచ్చిన ఒకే ఒక అవకాశమైన మన్మధుడు 2 కూడా ఘోరంగా దెబ్బతినడంతో ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేని పరిస్థితి నెలకొంది. అయితే మధ్యలో అక్కడక్కడా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తున్న రకుల్ కు అక్కడ కూడా పెద్దగా సక్సెస్ అయితే లభించడం లేదు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం కమల్, 

 

శంకర్ ల ప్రెస్టీజియస్ ప్రాజక్ట్ అయిన ఇండియన్ 2 కి లో ఒక హీరోయిన్ గా నటిస్తున్న రకుల్, ఆ సినిమాపై ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది. ఇక ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న రకుల్, ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తనకు ఇటీవల రెండు భారీ సినిమాల్లో అవకాశాలు దక్కాయని చెప్పడం జరిగింది. అయితే అవి ఏంటి అనేది మాత్రం ఆమె వెల్లడించకపోవడంతో, రకుల్ ఓఓఓఓఓ రకుల్, అసలు టాలీవుడ్ లో నువ్వు ఉన్నావా లేదా అంటూ కొందరు నెటిజన్లు సరదాగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో తెలుగులో ఈ అమ్మడు ఏ రేంజ్ లో అవకాశాలు అందుకుంటుందో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: