పవన్ కళ్యాణ్ క్రిష్ ల కాంబినేషన్ లో కొన్ని రోజుల క్రితం రహస్యంగా ప్రారంభం అయిన మూవీ షూటింగ్ పూజా కార్యక్రమం రోజున ఆ స్పాట్ లో కనిపించిన క్లాప్ బోర్డ్ పై కొందరు ఆశ్చర్యంతో పాటు సందేహాలు కూడ వ్యక్త పరుస్తున్నారు. ఈ సినిమాకు ఎఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తూ తన సూర్య మూవీస్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మిస్తున్నాడు.

అయితే ఈ మూవీ ప్రారంభోత్సవం రోజున తీయబడ్డ తొలి షాట్ ఇచ్చిన క్లాప్ బోర్డ్ పై ‘మెగా సూర్య మూవీస్’ అని ఉండటం చూసి చాలమంది ఆశ్చర్య  పోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మెగా ఫ్యామిలీకి చెందిన ఎవరైనా అజ్ఞాత భాగస్వామిగా కొనసాగుతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. 

వాస్తవానికి చిరంజీవి భార్య సురేఖ కు పవన్ తో ఒక సినిమా తీయాలని ఆమెకు అభిలాష ఉన్నట్లు ఓపెన్ గానే చరణ్ అనేక సార్లు చెప్పాడు. ఈ నేపధ్యంలో సురేఖ ను భాగస్వామిగా చేసి ఈ మూవీ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ హౌస్ కు మెగా సూర్య మూవీస్ అన్న పేరు పెట్టారా అన్న అనుమానాలు కూడ వస్తున్నాయి. 

వాస్తవానికి ఈ మూవీ నిర్మాత ఏఎమ్ రత్నం కు రేణు దేశాయ్ కూడ సన్నిహితురాలు. ఆమె ఒత్తిడి తోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది అన్న ప్రచారం కూడ ఉంది. దీనితో ఈ మూవీలో పవన్ కొడుకు అకిరా ను అజ్ఞాత భాగస్వామిగా పెట్టారా అన్న ఊహలు కూడ వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈ మూవీకి సుమారు 150 కోట్ల వరకు ఖర్చు పెడుతూ ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా తీయడం సంచలనంగా మారింది. ఇలాంటి భారీ మూవీ ప్రాజెక్ట్ కు హీరోయిన్ గా ఏమాత్రం ఇమేజ్ లేని ప్రాగ్య జైస్వాల్ ఎంపిక అయింది అని వస్తున్న వార్తలు మరింత షాక్ ఇస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: