టాలీవుడ్ లో నటి జీవిత రాజశేఖర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశంలో ఈ జంట కలిసి నటించారు. ఆ తర్వాత పెద్ద అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు శివాని.. శివాత్మిక. ప్రస్తుతం జీవిత ‘మా’ లో కీలక బాధ్యతలో ఉన్నారు. ఈ మద్య మా అసోయేషన్ ఏర్పాటు చేసిన ‘డైరీ’ ఆవిష్కరణ సందర్భంగా పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు, సుబ్బిరామిరెడ్డి వేధికపై ఉండగా డాక్టర్ రాజశేఖర్ తీవ్ర పదజాలంతో టాలీవుడ్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం.. తర్వాత ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న ‘చూసీ చూడంగానే’ సినిమా ఈవెంట్ ఈ మధ్యే జరిగింది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జీవిత మాట్లాడుతూ.. రాజ్ కందుకూరి.. మథుర శ్రీధర్ రెడ్డి తమ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారని.. తనకు కూతుర్లు శివాని.. శివాత్మిక ఎంతో శివ కందుకూరి కూడా అంతేనని.. కొడుకు లాంటివాడని తెలిపింది.
ఈ పిల్లల భవిష్యత్తు గురించి చాలా సార్లు తమ మధ్య చర్చలు జరిగాయని.. ఇప్పుడు శివ ‘చూసీ చూడంగానే’ సినిమాతో హీరోగా పరిచయం అవుతూ ఉండడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం అన్నది గొప్పగా అనుకోకుండా దాన్ని పక్కనబెట్టి.. మా పిల్లలో మంచి ఏదో ఉందో అది చూపించి ఎంకరేజ్ చెయ్యండి.. దీవించండి అంటూ జీవిత విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమ అంటే సక్సెస్, ఫెయిల్యూర్స్ ఉంటాయని.. ఏదైనా సంతోషంగా స్వీకరిస్తేనే మనుగడ ముందుకు సాగుతుందని అన్నారు.