ఒక దశాబ్ద కాలంగా టాప్ హీరోయిన్ స్టేటస్ ను కొనసాగిస్తున్న అనుష్క తన క్రేజ్ ను డబ్బుగా మార్చుకోవడంలో అంతగా తెలివిగా వ్యవహరించ లేకపోయింది అంటూ ఒక ప్రముఖ పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి అనుష్కకు ఉన్న క్రేజ్ రీత్యా ఆమెకు భారీ పారితోషికాలు నిర్మాతలు ఇచ్చినా వాటిని ఆమె సక్రమంగా ఇన్వెస్ట్ చేయలేదు అంటూ ఆ కథనంలో అభిప్రాయాలు వ్యక్తం చేయబడ్డాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు హైదరాబాద్ లో అనుష్కకు రెండు ఖరీదైన అపార్ట్ మెంట్స్ ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమం ఉదృతంగా జరుగుతున్న రోజులలో తన ఆస్థులకు విలువ తగ్గిపోతుంది అన్న భయంతో అనుష్క హైదరాబాద్ లోని తన ఆస్థులను తక్కువ ధరకు అమ్మింది అని అంటారు. ఇప్పుడు ఆ ఆస్థుల విలువ అనుష్క కలలో కూడ ఊహించని విధంగా పెరిపోయాయి. 

అదేవిధంగా అనుష్క ఒక టాప్ హీరో సలహాతో విశాఖపట్నం లో చాల మంచి సెంటర్ లో చాల విలువైన స్థలాలు కొన్ని సంవత్సరాల క్రితం కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి అమరావతి రాజధానిగా ఏర్పడటంతో తన విశాఖపట్నం భూములకు స్థలాలకు మంచి రెట్లు రావని అనుకుని అనాలోచితంగా ఆ భూములను అనుష్క తక్కువ రేట్లకు అమ్మేసిందట. 

అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం విశాఖపట్నం ను రాజధానిగా ప్రకటించిన నేపధ్యంలో అక్కడ స్థలాలు పొలాలు కలిగిన వారందరికీ కోట్లల్లో లాభాలు వస్తున్నాయి. ఈ లిస్టులో అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు కూడ ఉన్నట్లు సమాచారం అయితే విశాఖపట్నం భూములకు స్థలాలకు విలువలు పెరగక ముందే ఖంగారు పడి అనుష్క మళ్ళీ అదృష్టాన్ని పోగొట్టుకుంది అని అంటారు. ‘భాగమతి’ మూవీ తరువాత ఎన్నో ఆఫర్లు వచ్చినా తిరస్కరిస్తూ కేవలం ‘నిశ్శబ్దం’ సినిమాను మాత్రమే చేసి తన విలువైన కాలాన్ని అదేవిధంగా గడపలోకి వస్తున్న కోట్లను పోగొట్టుకుంటూ అనుష్క తన క్రేజ్ ను వృథా చేసుకుంటోంది అంటూ ఆ కథనంలోని విషయాలు చాల మంది దృష్టిని ఆకర్షించాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: