దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వాళ్ళలో అనుష్క కూడా ఒకరు. ఆనుష్క ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటిపోయింది. అయినా కూడా చెక్కు చెదరని అందంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటి స్టార్ స్టేటస్ ని అనుభవిస్తుంది. బాహుబలి సినిమా తర్వాత ఆమె స్టేటస్ మరింత పెరిగింది. బాహుబలి తర్వాత ఆమె భాగమతి అనే సినిమాలో లీడ్ రోల్ లో కనిపించి మంచి హిట్ అందుకుంది.

 

 

కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటున్న అనుష్క ప్రస్తుతం కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ కోనవెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న "నిశ్శబ్దం" అనే సినిమాలో నటిస్తుంది. అనుష్క తో పాటు ఆర్ మాధవన్ కూడా ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులని చకచకా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే అనుష్క కొన్ని విషయాల్లో మోసపోయిందట.

 

 


ఆమె ఆస్తి వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించకుండా నష్టపోయిందట. తెలంగాణ రావడానికి ముందు అనుష్క హైదరాబాద్ లో ఐదు కోట్లు పెట్టి నాలుగు ఫ్లాట్స్ కొన్నదట. కానీ తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందన్న నమ్మకంతో వాటిని అమ్మేసిందట. కానీ అలా జరగకపోవడంతో ఆ ఫ్లాట్స్ విలువ ఇప్పుడు పది కోట్ల వరకి ఉందట. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో భూములు కొన్నదట.

 

 

కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిని డెవలప్ చేస్తున్నాడని తెలిసి వాటిలో 80% భూములని అమ్మేసిందట. ఇప్పుడేమో వైజాగ్ ని రాజధాని చేసే ఆలోచనలో ఉండడంతో అక్కడ భూములకి బాగా డిమాండ్ వచ్చింది. సినిమాల్లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న అనుష్కకి ఆస్తులని ఎలా కాపాడుకోవాలి అనే అర్థిక జ్ఞానం ఎక్కువగా లేనట్టుంది. మరి ఇక ముందయినా ఇటువంటి విషయాల్లో అందరిమాటలు వినకుండా జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకుంటుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: