అనుష్క లీడ్ రోల్ లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరెకెక్కిన చిత్రం భాగమతి. బాహుబలి తర్వాత అనుష్క నుండి వచ్చిన చిత్రమిది. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. కథానాయికా ప్రాధాన్యమున్న ఈ సినిమా, అనుష్క  కెరీర్లో  అరుంధతి తర్వాత మళ్లీ అంతటి విజయాన్ని అందించింది. హారర థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకి ఒక డిఫరెంట్ అనుభవాన్ని మిగిల్చింది.

 

 

అయితే ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ కి కూడా వెళ్ళింది. గత కొంత కాలంగా తెలుగు సినిమాలకి బాలీవుడ్ లో మంచి గిరాకీ ఉంది. భూమి ఫడ్నేకర్ హీరోయిన్ గా తెరెకెక్కుతున్న ఈ సినిమాకి దుర్గావతి గా నామకరణం చేశారు. రీమేక్ కు కూడా అశోక్ దర్శకత్వం వహిస్తుండగా వయోకామ్ 18.. టిప్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. 

 

 

ప్రస్తుతం బోపాల్ లో ఈ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. అక్కడ ఒక పాత భవంతిలో ఈ చిత్రంను చిత్రీకరిస్తున్నారు. హిందీ నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో పాటు సినిమాలో ముఖ్య పాత్రకు గాను అక్షయ్ కుమార్ ను నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాకి మరింత పబ్లిసిటీ వచ్చినట్టే. ఇప్పుడు అక్షయ్ కుమార్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. 

 

 

ఆయన చేసిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పుడు అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నటిస్తుండని తెలియడంతో ఈ సినిమాకి మరింత హైప్ రావడంతో పాటు, కలెక్షన్ల పరంగానూ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మరి స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో ఏ పాత్రలో నటిస్తున్నాడనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: