టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్. ముకుంద మూవీ తర్వాత స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ‘కంచె’ మూవీతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. అంతే కాదు ఈ మూవీ ఏకంగా జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం మరో విశేషం. ముకుంద తర్వాత వెంటనే కంచె లాంటి పిరియాడికల్ మూవీలో నటించడం వరుణ్ తేజ్ కి బాగా కలిసి వచ్చింది. తన నటనకు మంచి స్కోప్ ఉండటం.. ఆర్మీనేపథ్యం కావడం అందుకు తగ్గట్టు తన పర్సనాలిటీ సెట్ కావడం ఈ మెగా హీరోకి అన్నీ కలిసి వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ఒకటీ రెండు సినిమాలు తప్ప వరుస విజయాలు అందుకుంటున్నాడు వరుణ్ తేజ్. గత ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలకొండ గణేష్’ తో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇదిలా ఉంటే... 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా తర్వాత దర్శకులు క్రిష్ కాస్త గ్యాప్ ఎక్కువే తీసుకుంటున్నారు. ఈ మూవీ ఇది బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాని రూపొందిస్తున్నారట. ఈ మూవీ తర్వాత మరోసారి వరుణ్ తేజ్ తో క్రిష్ మూవీ తీసేందుకు సిద్దం అవుతున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో త్వరలో వరుణ్తో రూపొందించే సినిమాని స్పై థ్రిల్లర్గా తెరకెక్కించేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నారట.
గతంలో వీరి కాంబినేషన్లో 'కంచె'మూవీవచ్చిన విషయం విదితమే. కులం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన విషయం తెలిసిందే. గతేడాది 'ఎఫ్ 2', 'గద్దల కొండ గణేష్'తో విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ మూవీలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వరుసగా విజయాలు అందుకుంటున్న వరుణ్ తేజ్ ఈసారి కూడా హిట్ కొడితే.. వరుస హ్యాట్రిక్ విజయాలు అందుకున్నట్లే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.