టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో మెగా ఫ్యామిలీ హీరోలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఈ క్రమంలో మోహన్ బాబు కూతురు నటిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతుంది.  తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబుకి మధ్య ఎలాంటి గొడవల్లేవని ప్రముఖ నటి మోహన్ బాబు కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఆత్మీయక్షణాలకు సంబంధించిన ఫొటోను పంచుకున్న మంచు లక్ష్మి ఈ వ్యాఖ్యలు చేశారు.

 

అంతే కాదు ఈ ఏడాది ది బెస్ట్ ఫోటో అని కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఇంటర్నెట్ లో తన తండ్రి, చిరంజీవిల ఫొటోలు సందడి చేస్తుండడం చూసిన తర్వాత ఎంతో సంతోషం కలిగిందని, ఒకవేళ తన తండ్రి మోహన్ బాబుకు, చిరంజీవి అంకుల్ కు మధ్య గొడవలు ఉంటే రెండు కుటుంబాల వాళ్లం ఇన్నేళ్లు కలిసిమెలిసి ఉండేవాళ్లం కాదని స్పష్టం చేసింది. ఒకవేళ వాళ్ల మధ్య గొడవలు ఉండి ఉంటే కలిసి అన్ని సినిమాల్లో నటించేవాళ్లు కాదని మంచు లక్ష్మీ తెలిపింది.

 

ఇటీవల మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా నటుడు డాక్టర్ రాజశేఖర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దాంతో వేదికపై ఉన్న ఉన్న చిరంజీవి, మోహన్ బాబు అసహానికి గురయ్యారు.  చిరంజీవి మరింత ఆవేశపడి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిరియస్ గా చెప్పారు.   ప్రతిసారి చిరు, మోహన్ బాబు ల మద్య ఎదో ఒక గొడవ ఉందని అనడం.. తర్వాత వీరిద్దరూ అబ్బే మా మద్య ఏదీ లేదని క్లారిటీ ఇవ్వడం పరిపాటైంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: