పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ ని అందుకున్న పింక్ సినిమా అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ సినిమాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను రాబోయే మే లో రిలీజ్ చేసే అవకాశం కనపడుతోంది. ఇక ఇటీవల క్రిష్ దర్శకత్వంలో పూజ కార్యక్రమాలు జరుపుకున్న పవన్ 27వ సినిమా కూడా అతి త్వరలో షూటింగ్ ని ప్రారంభించుకుని రాబోయే సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు సమాచారం. మంచి పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను ఏ ఎమ్ రత్నం తన సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా పవన్ కళ్యాణ్ ఒక గజ దొంగగా నటిస్తున్నట్లు టాక్. 

 

ఇకపోతే దీని తరువాత పవన్ 28వ సినిమా ప్రకటన కూడా నేడు అఫీషియల్ గా రావడం జరిగింది. కొన్నేళ్ల క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత భారీ విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇక మళ్ళి ఇన్నేళ్లకు వారిద్దరి కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుంది. మైత్రి మూవీస్ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు కాసేపటి క్రితం ప్రకటన రావడం జరిగింది. ఇక ఈ కాంబినేషన్ కోసం పవన్ ఫ్యాన్స్ నిజానికి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. తప్పుకుండా పవన్ ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండనున్నట్లు హరీష్ అంటున్నారు. కాగా పవన్ కళ్యాణ్ సరసన ఒక స్టార్ హీరోయిన్ నటించనున్న ఈ సినిమాని దసరాకు మొదలెట్టి రాబోయే వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. 

 

ఇక దీని తరువాత పవన్ నటించే 29వ సినిమా కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. ఇటీవల జెర్సీ తో మంచి విజయాన్ని అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా సాగనున్న ఈ సినిమాలో పవన్ పాత్ర ఎంతో ఆకట్టుకుంటుందని, అలానే అతి త్వరలో ఈ సినిమా ప్రకటన కూడా రానుందని టాక్. మొత్తంగా చూస్తే ఒక్కసారిగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న పవన్, ఈ విధంగా ఒకేసారి నాలుగు సినిమాలు లైన్లో పెట్టడం నిజంగా ఆయన ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అంశం అనే చెప్పాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: