రాజమౌళి వ్యవహారం పెద్ద హీరోలకు తలనొప్పిగా మారింది. రాజమౌళి రియాక్షన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తీస్తున్న ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ మారడంతో.. చిరంజీవి.. మహేశ్.. బన్నీ.. ప్రభాస్ కన్ ఫ్యూజన్ లో పడిపోయాడు. 

 

ట్రిపుల్ ఆర్ వాయిదాతో స్టార్స్ అందరూ డైలమాలో పడిపోయారు. జులై 30న రిలీజ్ అంటూ.. సినిమా మొదలైన నెల రోజులకే ఎనౌన్స్ చేశారు. అనుకున్న టైమ్ లో షూటింగ్ పూర్తికాకపోవడంతో.. రిలీజ్ వాయిదా తప్పలేదు. రిలీజ్ సమయంలో మాత్రం క్లారిటీ రాలేదు. దీంతో ముందుగా డేట్ ఫిక్స్ చేసుకున్న హీరోలు తమ సినిమాలు రిలీజయ్యే టైైమ్ లో ట్రిపుల్ ఆర్ వస్తుందా..? అనే అనుమానం వీళ్లను భయపెడుతోంది. 

 

రాజమౌళి సినిమా వస్తుందంటే.. స్టార్ హీరోలు తప్పుకుంటారు. గతంలో బాహుబలి కోసం శ్రీమంతుడు రెండు వారాలు వాయిదా వేసుకున్నాడు. జులై 30న రావాల్సిన సినిమా దసరాకు వెళితే.. ఆ టైమ్ లో వద్దామనుకున్న ప్రభాస్ కు ఇబ్బందే. రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను దసరాకు రిలీజ్ చేస్తున్నారు. 

 

ట్రిపుల్ ఆర్ ను దసరాకు రిలీజ్ చేయడం కుదరకపోతే.. 2021 సంక్రాంతికి తెచ్చే ప్లాన్ కూడా ఉంది. అయితే.. 2021 సంక్రాంతిపై ఇప్పటికే ముగ్గురు హీరోలు కర్చీపులు వేశారు. సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురములో హిట్ కావడంతో.. మహేశ్, బన్నీ 2021 సంక్రాంతిని టార్గెట్ చేశారు. ట్రిపుల్ ఆర్ సంక్రాంతికి వస్తే.. బన్నీ, మహేశ్ మరో డేట్ చూసుకుంటారో.. లేదంటే.. డేర్ చేసి వచ్చేస్తారో చూడాలి. ఇలా.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ ఛేంజ్ పెద్ద హీరోల టైమ్ టేబుల్ ను మార్చేస్తోంది. 

 

మొత్తానికి రాజమౌళి తీరు పెద్ద హీరోలకు పెద్ద తలనొప్పిగా మారింది. సినిమా రిలీజ్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం స్టార్స్ లో గుబులు రేపుతోంది. తాము నటిస్తున్న సినిమాలు రిలీజ్ కు డేట్స్ దగ్గర పడుతుండటంతో.. అదే సమయానికి ఎక్కడ రాజమౌళి సినిమా వస్తుందోనన్న టెన్షన్ వారిలో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: