కరోనా  వైరస్ ప్రస్తుతం చైనాని ప్రాణభయంతో వణికిస్తోంది. చైనా ప్రజలందరూ కరుణ వైరస్తో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటికే ఈ మాయదారి ప్రాణాంతకమైన కరోనా వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలిగొంది. ఇక శరవేగంగా చైనాలో వ్యాప్తిచెందుతుంది ఈ వైరస్... దీంతో ఎంతో మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణభయంతో నే బతుకుతున్నారు. ప్రాణాంతకమైన కరోనా  వైరస్ కారణంగా చైనాకు ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఇక అటు ప్రపంచ దేశాలు కూడా కరోనా వైరస్ నుంచి బెంబేలెత్తిపోతున్నారు. 

 

 

 ఎక్కడ తమ దేశంలోకి కరోనా  వైరస్ వ్యాప్తి చెంది ప్రాణాలను బలి తీసుకుంటుందో అనే బెంబేలెత్తిపోతున్నారు. కరోనా  వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో... ప్రస్తుతం ప్రపంచ దేశాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఆయా దేశాలు తమ తమ దేశాల పరిధిలోకి కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.ఆయా  దేశాలలో కరోనా వైరస్ బాధితులు కనిపిస్తే చాలు వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని దేశాలు చైనా కు వెళ్లే విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. 

 

 

 కాగా  ఇప్పటికీ ఎంతోమంది కరోనా వైరస్ పేరు ఎత్తితే భయపడుతున్నారు. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు హీరోయిన్ నివేద పేతురాజ్ ఓ చిట్కా చెప్పింది. కరోనా  వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది.  ప్రస్తుతం అది వైరల్ గా మారిపోయింది.  పసుపు తులసి అల్లం మిరియాలు కలిపిన కషాయాన్ని తాగుతూ ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది నివేదా పేతురాజు.  ఈ కషాయం తో కరోనా వైరస్ ను నివారించవచ్చు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: