శర్వానంద్, సమంత జోడీగా నటించిన ‘జాను’ మూవీ ఈనెల 7న విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్‌లో భాగంగా శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌ లో నాని మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. రాజుగారు 96 సినిమాను రీమేక్ చేద్దాం అని డిసైడ్ అయ్యిన ఒపీనియన్ కోసం నాకు చూపించారు. అప్పుడు నేను.. ‘సార్ ఇంత మంచి సినిమా.. విజయ్ సేతుపతి, త్రిషలు ఇంత బాగా చేశారు. దీన్ని టచ్ చేయకండి అన్నాను. ఈ సినిమాపై ఎప్పుడు డిస్కషన్స్ వచ్చినా.. తెలుగుతో తీయకూడదనే చెప్పా.. 


కాని సమంత, శర్వానంద్ చేస్తున్నారని తెలిసిన రోజు.. తెలుగులో ఎందుకు చేయడం అని అనిపించలేదు.. తెలుగులో ఎప్పుడు చూస్తామా అని అనిపించింది. ఆ నమ్మకం నాకు ట్రైలర్ చూసిన తరువాత మరింత పెరిగిపోయింది.


అప్పటి నుండి నా మైండ్‌లో ఉన్న తమిళ 96 మూవీ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు జాను అంటే నాకు వీళ్లిద్దరే గుర్తుకువస్తున్నారు.శర్వానంద్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఫస్ట్ ఫ్రెండ్ వాడు.అప్పుడప్పుడూ పాత ఫ్రెండ్స్‌ని కలిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సమంత గురించి చెప్పాలంటే.. ఎటో వెళ్లిపోయింది మనసు ఈ టైంలో చేస్తే ఓ లెవల్‌లో ఉంటుందని నా ఫీలింగ్. అలాంటిది ఏదైనా ప్లాన్ చేద్దాం. ప్రతి సంవత్సరం 10 మంచి సినిమాలు ఉంటే.. అందులో సమంత సినిమాలు రెండు మూడు ఉంటాయి.


కొన్ని సినిమాలు చూస్తాం.. ఎంజాయ్ చేస్తాం.. ఇంటికి వెళ్లిపోతాం.. అయితే కొన్ని సినిమాలు చూస్తాం.. ఎంజాయ్ చేస్తాం.. ఇంటికి తీసుకుని వెళ్తాం. జాను సినిమాను ఇంటికి తీసుకుని వెళ్తాం. ఆ నమ్మకం నాకు ఉంది అంటూ శర్వానంద్‌లో ‘జాను’ సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను అతి కష్టం మీద చెప్పించారు నాని. 

మరింత సమాచారం తెలుసుకోండి: