బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, టీం ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరు కొంతకాలం ప్రేమించుకున్నాక పెళ్ళి చేసుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు ప్రేమించుకుంటారు. ఇష్టమొచ్చినట్టు పార్టీలు, పబ్ లు, అంటూ తిరిగేస్తారు. డేటింగ్ అంటూ చేయాల్సిన విధంగా ఎంజాయ్ చేస్తారు. చివరకు మాకు పొంతన కుదరలేదని అందుకే బ్రేక్ అప్ చేసుకున్నాము సొల్లు చెప్తుంటారు. మళ్ళీ మీడియా మా మీద పిచ్చి రాతలు రాస్తుంది అంటూ చెలరేగిపోతుంటారు. 

 

ఇక 2018 వచ్చిన ‘జీరో’లో అనుష్కశర్మ చివరిసారిగా ప్రేక్షకులకు కనిపించింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ కూడా మరో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అప్పటి నుంచి అనుష్క కెమెరాకు దూరంగా ఉంటూ వస్తోంది. పెళ్లికి ముందు వరుస సినిమాలు చేసిన అనుష్కశర్మ విరాట్‌తో జీవితం మొదలు పెట్టిన తర్వాత సినిమాలు తగ్గించింది. కొత్తగా టీవీ ప్రకటనల్లోనూ అంతగా కనిపించడం లేదు. గ్రాజియా మ్యాగజైన్‌ ఫిబ్రవరి సంచికపై అనుష్క చిత్రం కవర్‌ఫొటోగా ప్రచురితమైంది. ఈ సందర్భంగా సినిమాల నుంచి దూరంగా ఉండటానికి గల కారణాలు అనుష్కశర్మ వెల్లడించింది.

 

ఒకేసారి రెండుమూడు సినిమాలు చేస్తుండటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని వీరాట్ చెప్పాడట. జీవితంలో సినిమాతో పాటు చేయాల్సినవి చాలా ఉంటాయి. మిగిలిన పనులను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. వరుస సినిమాలు చేస్తున్నప్పుడు మనకు వేరే ఛాయిస్‌ ఉండదు. ఒక్కోసారి సినిమాల షెడ్యుల్‌ వల్ల కంప్లీట్ గా లాక్ అయిపోతాము. మంచి అవకాశాలను వదులుకోవడానికి మంచి సమయం అనేది ప్రత్యేకంగా ఉండదు. కానీ, నేను ఇంకా ఎదగాలని అనుకుంటున్నాను. నన్ను నేను భిన్నమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాను. నాలోని సృజనాత్మకతకు మరింత పదును పెట్టి నేను ఉత్పత్తి రంగంలో రాణించాలని అనుకుంటున్నాను’ అని అనుష్క తెలిపింది. అయితే యనలోని ఈ మార్పుకు కారణం తన భర్త వీరాట్ అంటూ చెప్పకనే చెప్పింది. దీన్ని బట్టి అనుష్కశర్మ సినిమాలకి కాస్త దూరం అయిందంటే వీరాట్ వల్లే అని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: