బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా బాగా క్రేజ్ సంపాదించిన నటుడు దర్శన్ ... ప్రస్తుతం బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత దర్శన్ కు వరుస సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి . అయితే బిగ్ బాస్ షో కి వెళ్లడానికి ముందు... దర్శన్ నటి సనం శెట్టితో కలిసి ఓ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. కాగా చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలోనే దర్శన్ కి బిగ్ బాస్ షో లో పాల్గొనేందుకు అవకాశం రావడంతో బిగ్ బాస్ షో కి వెళ్ళిపోయాడు. ఇక బిగ్ బాస్ షో నుంచి దర్శన్ వచ్చిన తర్వాత... సనం శెట్టి దర్శన్ పై శుక్రవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అనంతరం వీడియో తో మాట్లాడిన సనం శెట్టి దర్శన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
మేమిద్దరం ప్రేమించుకున్నాం 2019 మే లో వివాహ నిశ్చితార్ధం కూడా జరిగింది అని తెలిపింది. ఇద్దరి కుటుంబాల ఒప్పుకోవడంతో జూన్లో పెళ్లి చేసుకోవడానికి తామిద్దరం సిద్ధమయ్యాముం అంటూ చెప్పుకొచ్చింది సనం శెట్టి . అయితే దర్శన్ కు బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొనే అవకాశం రావడంతో పెళ్లిని వాయిదా వేసుకుందామని చెప్పటంతో... అందుకు తాను కూడా అంగీకరించినట్లు చెప్పింది. బిగ్ బాస్ షో ద్వారా దర్శన్ కు మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం నేనే అంటూ పేర్కొంది. దర్శన్ కోసం ఏకంగా 15 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశానని... కానీ బిగ్ బాస్ నుంచి దర్శన్ బయటకు వచ్చిన తర్వాత దర్శన్ పూర్తిగా మారిపోయాడు అంటూ ఆరోపించింది సనం శెట్టి .
పెళ్లి కూడా వద్దని ఆపేసాడు అని తెలిపింది. దీనిపై దర్శన్ తల్లిదండ్రులను సంప్రదిస్తే అప్పుడు మా వాడికి నీపై ప్రేమ ఉంది... ఇప్పుడు ప్రేమ పోయింది అంటున్నారు అంటూ వాపోయింది. దర్శన్ తనకు ప్రేమ పేరుతో నమ్మక ద్రోహం చేశాడని ఆరోపించిన సనం శెట్టి పోలీస్ కేసు పెట్టింది.కాగా సనం శెట్టి ఆరోపణలపై స్పందించిన దర్శన్ మీడియాతో మాట్లాడాడు. సనం శెట్టి ఇటీవలే తన పాత బాయ్ ఫ్రెండ్ తో ఒక రాత్రంతా గడిపింది అంటూ సంచలన ఆరోపణలు చేశాడు దర్శన్ .తనను వివాహం చేసుకునే ప్రసక్తి లేదు అంటూ తేల్చి చెప్పాడు.