తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ. మన దగ్గర టాలెంట్ ఉన్నా కూడా తెల్ల తోలని చెప్పో మరోటనో ఎక్కడెక్కడి నుండో పట్టుకొస్తుంటారు. అయితే నార్త్ నుండి వచ్చే హీరోయిన్లందరూ బాలీవుడ్ లో ప్రయత్నించి, అక్కడ అవకాశాలు రాక వచ్చిన వాళ్ళే అయ్యుంటారు. ఒక్కసారి ఇక్కడ అవకాశాలు వచ్చి కొద్దిగా పేరు వచ్చిన తర్వాత ఇక వారు ఆగడాలకి అంతు ఉండదు.

 

 

మొదట్లో ఎంతో తక్కువ రెమ్యునరేషన్ కి పనిచేసే వారు సైతం పేరు రాగానే ఎక్కువ మొత్తంలో డబ్బులు అడుగుతుంటారు. ఇక ఇక్కడ వచ్చిన పేరుతో బాలీవుడ్ లో గనక ఆఫర్లు వస్తే ఇక అంతే. మళ్ళీ సౌత్ సినిమాల్లో నటించమంటే కోట్లకి కోట్లు కుమ్మరించాల్సిందే.. తాజాగా ఈ లిస్ట్ లోకి కియారా అద్వానీ కూడా చేరిపోయింది. కియారా అద్వానీ మొదటగా బాలీవుడ్ లోనే నటించింది. భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

 

 

ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలోనూ నటించింది. ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. కబీర్ సింగ్ హిట్ అవడంతో ఆమె పూర్తిగా మారిపోయింది. వరుస ఆఫర్లతో చేతినిండా సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఆమెని తెలుగు నిర్మాతలు తమ సినిమాల్లో నటించమని సంప్రదిస్తున్నారట.

 

 

 

కానీ ఆమె అడిగిన రెమ్యునరేషన్ కి షాక్ కి గురవుతున్నారట. సౌత్ సినిమాల్లో నటించాలంటే ఏకంగా ఐదున్నర కోట్లు అడుగుతుందట. హీరోలకి సైతం ఇవ్వని రెమ్యునరేషన్ ని అడిగేసరికి షాక్ కి గురవుతున్నారు. ఎంతైనా బాలీవుడ్ లో ఆఫర్లు వస్తే సౌత్ లో నటించడానికి సంకోచిస్తారు. అదేంటో మరి వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: