పొలిటికల్ ఎంట్రీతో సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ను పవన్ ప్రధాన పాత్రలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను కోలీవుడ్లో అజిత్ హీరోగా రీమేక్ చేసి సక్సెస్ అయిన బోనీ కపూర్ తెలుగు వర్షన్ కూడా నిర్మించనున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. లాయర్ సాబ్ అనే టైటిల్ కూడా ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. అలాగే మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీకి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడు.
ఓ వైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పింక్' రీమేక్ సినిమాలో నటిస్తూనే.. క్రిష్ తో కూడా మూవీ ప్రారంభించేశాడు పవన్. కేవలం వారం రోజుల గ్యాప్లోనే ఈ రెండు సినిమాలను సెట్స్ మీదకు రావడం విశేషం. ఈ క్రిష్ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నటించబోయే హీరోయిన్ను కూడా ఫిక్స్ చేశారని టాక్. క్రిష్ దర్శకత్వంలో వచ్చి కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ ను మళ్లీ అదే క్రిష్ సినిమాలో పవన్ పక్కన నటించబోతోన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి క్రిష్ బాలకృష్ణతో చేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫార్మాట్ ని ఫాలో అవుతున్నాడు.
ఏ పరంగా అనే విషయానికి వస్తే.. షూటింగ్ డేస్ పరంగా కేవలం 100 నుంచి 120 రోజుల్లో ఈ భారీ పీరియడ్ ఫిల్మ్ ని ఫినిష్ చేయనున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి’ ని కేవలం 100 రోజుల్లో ఫినిష్ చేసిన క్రిష్.. ఇంత క్వాలిటీ ఫిలిం అంత త్వరగా ఎలా చేశారా అని ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే మళ్లీ ఇప్పుడు అదే ఫార్మాట్ను పవన్ కళ్యాణ్ సినిమాకు ఫాలో అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటి వరకు తన కెరీర్లో ఒక్కసారి కూడా పీరియాడికల్ సినిమా చేయని పవన్ కళ్యాణ్.. తొలిసారి క్రిష్ కాంబినేషన్లో ఈ సినిమా చేయబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.