‌అల వైకుంఠపురంలో సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఆ చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉంది. సినిమాకు భారీగా కలెక్షన్లు సాధించామంటూ ఇప్పటికే రెండు ఈవెంట్లు సైతం చేశారు. ఇందులో భాగంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లను పిలిచి పెద్ద పార్టీ కూడా ఇచ్చారు. తాజాగా తమ మంచి కోరుకునే ఇండస్ట్రీలోని జనానికి సైతం గ్రాండ్ పార్టీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పార్టీకి ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సైతం పిలువబోతోందట అల్లు ఫ్యామిలీ.

 


ఆ పార్టీకి సంబంధించిన ఇన్విటేషన్లు సైతం అల వైకుంఠపురం టీం నుంచి ఇప్పటికే పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు,నిర్మాతలు, మిగతా పెద్దలకు కూడా వెళ్లినట్లు తెలిసింది. కానీ బన్నీ, ఆయన నిర్మాతలు ఇచ్చే పార్టీలకు వెళ్లాలంటేనే వారంతా భయపడుతున్నారు. దీనికి కారణం సూపర్ స్టార్ మహేశ్ బాబు అని తెలుస్తోంది. అల వైకుంఠపురంతో పాటు, సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా కలెక్షన్లు భారీగానే వచ్చాయి. అయితే బన్నీ ఆయన నిర్మాతలు మాత్రం తమ సినిమానే హిట్ గా ప్రొజెక్ట్ చేసుకొని 'సరిలేరు' టీం మీద ఇన్ డైరెక్ట్ సెటైర్లు వేస్తున్నారు. ఈ కారణంతోనే అల వైపుంఠపురంలో సినిమా యూనిట్ ఇచ్చే పార్టీకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ పార్టీకి దిల్ రాజు కూడా దూరంగా ఉంటున్నారు.

 

అల వైకుంఠపురంలో చిత్ర యూనిట్ ఇచ్చే పార్టీకి వెళ్ళడం, అక్కడ మహేశ్ సినిమా మీద సెటైర్లు వేసిన విషయం సూపర్ స్టార్ మహేష్ కి చేరితే ఆయన ఫీలయ్యే అవకాశం ఉందని, దీంతో ఎందుకొచ్చిన గొడవ అంటూ సైడ్ అవుతున్నారు. ముఖ్యంగా డైరెక్టర్స్, నిర్మాతలు ఈ పార్టీకి దూరంగా ఉంటారని టాలీవుడ్ టాక్. మరి ఈ పార్టీలో ఫైనల్ గా ఎవరెవరు కనిపిస్తారో పార్టీ జరిగే రోజున చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: