మెగాస్టార్  చిరంజీవి, కలెక్షన్ కింగ్  మంచు మోహన్ బాబు మధ్య వివాదాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఇద్దరి మధ్య ఒకప్పుడు టాలీవుడ్​లో పెద్ద చర్చే జరిగింది.  టాలీవుడ్​ వజ్రోత్సవాల సమయంలో వచ్చిన గొడవలు మొన్నటి వరకు కొనసాగింది. కానీ    ఇటీవల ‘మా’ డైరీ ఆవిష్కరణ వేదికపై ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చూశాక.. గత వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని టాలీవుడ్​ వర్గాలు భావిస్తున్నాయి.  2020 `మా` డైరీ ఆవిష్కరణలో భాగంగా మైక్ లో చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఆ వెనుక కూర్చున్న చిరు.. సడెన్ గా కుర్చీలో నుంచి లేచి  మోహన్ బాబును వెనకగా ఆలింగనం చేసుకుని...బుగ్గపై ఓ స్వీట్ కిస్ ఇచ్చేసిన ఫన్నీ మూవ్ మెంట్ ని ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు.

 

వివాదాలు ఉన్నా అవి కొంతకాలమేనని... నా ఇంటికి చిరంజీవి రాకుండా ఉంటారా? ఆయన ఇంటికి నేను వెళ్లకుండా ఉండిపోతానా? అని ఆ సందర్భంలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న వివాదం పూర్తిగా సమసిపోయిందనే అర్థమైంది. తాజాగా మెహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఆ ఇద్దరి స్నేహం పైనా ఆసక్తికర సంగతులు తెలిపారు.

 

ఇద్దరి మధ్య ఎలాంటి  గొడవలు లేవని.. వాళ్లిద్దరి ఆలింగనం చేసుకున్న ఫోటో చూస్తుంటో ఎంతో ముచ్చటేస్తోందని వ్యాఖ్యానించారు. సమకాలీన నటులుగా.. ఆ ఇద్దరూ స్నేహితులు అని మోహన్​బావు కూతురు లక్ష్మీ ప్రసన్న మరోసారి వెల్లడించారు. వారంతంలో వాళ్లు మా ఇంటికి.. మేము వాళ్ల ఇంటికి వెళ్లే వాళ్లమని.. చిరంజీవి- మోహన్ బాబు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారని లక్ష్మీ ప్రసన్న తెలిపారు. అలాగే షూటింగ్ లు ఎక్కువగా ఊటీలో జరుగుతున్నప్పుడు రెండు కుటుంబాలు కలిసి తరుచూ అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసే వాళ్లమని వెల్లడించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: