గతేడాది నవంబర్లో జరిగిన దిశ రేప్ అండ్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సైలెంట్ ఉన్న విషయం ఆర్జీవీ ఎంటర్తో మళ్లీ చర్చనీయాంశమైంది. దిశ నిందితులను హత్య జరిగిన రోజే పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం, రిమాండ్కు పంపడం, జనాలు కూడా వారిని ఉరితీయాలని ఆందోళనలు చేయడం, పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకోవడం, అనంతరం వారిని దిశను కాల్చిన ప్రాంత సమీపంలో ఎన్కౌంటర్ జరగడం వంటి అంశాలు వరుసగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి దిశ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ సినిమా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. నిందితుల కుటుంబాల గురించి కూడా వివరాలు తెలుసుకోవడానికి నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆదివారం కలిశారు. అతని భార్య రేణుకకు భవిష్యత్తు లేకుండా చేశాడని వర్మ మండిపడ్డారు. ‘రేణుక 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది, 17 ఏళ్లకే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందన్నారు. బాస్టర్డ్ చెన్న కేశవులు దిశను మాత్రమే కాకుండా.. అతని భార్య రేణుకను కూడా బాధితురాలిగా మార్చాడు. వాడి వల్ల ఒక బాలిక మరో పాపకు జన్మనిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు వారిద్దరికీ భవిష్యత్తు లేకుండా పోయింది’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.
అయితే దిశ హత్య కేసు నిందితులు నలుగురు ఉన్నప్పటికీ వారిలో మొదట చెన్నకేశవులు భార్యనే వర్మ ఎందుకు కలిశాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మిగతా ముగ్గురిని వర్మ కలుస్తారా? కలిస్తే ఎలాంటి వివరాలు సేకరిస్తారు.. వారిని ఎప్పుడు కలవనున్నాడని వర్మ అభిమానులు, సగటు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.