గౌతమ్ తిన్ననూరి ఎమోషనల్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించగల సమర్థుడు. మళ్లీరావా- జెర్సీ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు ఈ దర్శకుడు. ఆ రెండు సినిమాలతో  సెన్సిబుల్ లవ్ స్టోరీలను ఎలివేట్ చేయగల దర్శకుడు దొరికాడని, మంచి ఎమోషన్స్ అతను తీయగలడని పేరు తెచ్చుకున్నాడు. ఆ రెండు సినిమాలతో బడా బడా నిర్మాతల దృష్టి తన మీద పడేలా చేసుకున్నాడు.  

 

గౌతమ్ యూనిక్ మేకింగ్ పరంగా, కంటెంట్ చూపడం లో దిట్ట అని ఆ రెండు సినిమాలు నిరూపించాయి. తానూ తీసిన జెర్సీ చిత్రం ఇతర భాషల్లోనూ అనువాదం చేయబోతున్నారు.  జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్ లో  షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అల్లు అరవింద్-దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. గౌతమ్ తదుపరి సినిమా  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోచేయడానికి సిద్ధం అవుతున్నట్లు సినీ వర్గాల బోగట్టా. చరణ్కు  ఇప్పటికే ఒక సారి  స్ర్కిప్ట్ వినిపించాడంట ఈ దర్శకుడు . ఈ చిత్రాన్ని ఎ న్. వి ప్రసాద్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోమ్ది.  

 

ఎన్. వి. ప్రసాద్ జెర్సీ ప్రారంభానికి  ముందే  గౌతమ్ కి అడ్వాన్స్ గా కొంత పారితోషికం  ఇచ్చాడంట. ఈ సినిమా హిట్ అయినా తర్వాత నిర్మాత గౌతమ్ కి టచ్ లో ఉన్నట్లు, తన తదుపరి సినిమా నువ్వే చేయాలి అని చెప్పి నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి . రామ్ చరణ్- గౌతమ్ మధ్య  ఎన్ . వి ప్రసాద్ ఓ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సినిమా ను ఎలా గైనా పట్టాలు ఎక్కించాలని చూస్తున్నారట. ఈ సినిమా అన్ని ఓకే ఐతే  వచ్చే ఏడాది  సినిమా ప్రారంభం కానుందని  తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్  ఆర్ మూవీ చేస్తున్నాడు, ఈ సినిమా పూర్తి అయినా తర్వాత తన తదుపరి సినిమా కోసం ఈ సినిమాను ఎన్నుకొంటాడా లేదా చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: