ఇటీవల బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకొని వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గతంలో ‘అజ్ఞాతవాసి’ తో  సినిమాలు ఆపేసిన పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు ఏకధాటిగా సినిమారంగంలో బిజీ అవ్వడం జరిగింది. అయితే ఇటీవల ఎన్నికలలో మొట్టమొదటి సారి పోటీ చేసిన పవన్ ఓడిపోవడం జరిగింది. దీంతో ప్రస్తుతం సినిమా రంగంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమా తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

 

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా మొదలు పెట్టి నెలరోజులు కాకముందే క్రిష్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసిన పవన్ తాజాగా తన కెరియర్ లో ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పటం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఆ సంస్థ అధికారికంగా తెలపడం జరిగింది. ఈ సినిమాలో పవన్ తో ఏ హీరోయిన్ చేయించాలనే ఆలోచనలో డైరెక్టర్ హరీష్ శంకర్ వుండగా ఇద్దరిపై కన్నేసినట్లు ఇండస్ట్రీలో టాక్.

 

పవన్ పక్కన పూజా హెగ్డే గాని లేకపోతే శృతిహాసన్ గాని నటింపజేయడానికి హరీష్ శంకర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో పవన్ తో తీసిన 'గబ్బర్ సింగ్' సినిమా లో శృతి హాసన్ తో హరీష్ పనిచేయటం జరిగింది. ఆ సినిమా ఇండస్ట్రీలో టాప్ హిట్ అయింది. ఇటువంటి తరుణంలో మళ్లీ శృతి హాసన్ ని తీసుకోవాలనే ఆలోచనలో హరీష్ శంకర్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. కాగా ఈ సినిమాని చాలా వైవిధ్యంగా మెసేజ్ ఓరియంటెడ్ టైపు తీయాలని హరీష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: