టాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గొప్ప పేరు తెచ్చుకున్నారు పూరి జగన్నాధ్. ఇంకెవరికి సాధ్యం కానంత స్పీడ్ గా సినిమాను పూర్తి చేసే దర్శకులేవరంటే ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకులు సెకండ్ లో చెప్పే పేరు పూరి జగన్నాథ్. కథ ఎంత పెద్దదైనా స్టార్ హీరో చేసినా పూరి మాత్రం అనుకున్న టైం లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తారు. పోకిరి సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక మాట అడిగారట. మహెష్ తో సినిమా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసావ్ అని. అప్పుడు పూరి 90 రోజులు అని చెప్పాడట. ఇంకో పదిరోజులు తీసుకో ..సినిమా బ్లాక్ బస్టర్ కావాలి అని అన్నారట సూపర్ స్టార్. ఆయన అడిగినట్టుగానే పూరి మహెష్ కి బ్లాక్ బస్టర్ కాదు ఇండస్ట్రీ రికార్డ్ ని ఇచ్చారు. అది పూరి స్టామినా. ఇక స్క్రిప్ట్ లో రాసుకున్నది మాత్రమే తీసి ముందు అనుకున్న బడ్జెట్ లోనే సినిమా తీసే అతి తక్కువ మంది దర్శకుల్లో పూరి ఆల్ వేస్ టాప్ అండ్ బెస్ట్.

 

అయితే ఇప్పుడు అందరు దర్శకుల్లాగా మారిపోతున్నారు పూరి. మొదటిసారి తన రూల్స్ తనే బ్రేక్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమాకు ఎక్కువ షూటింగ్ డేస్ తీసుకోనున్నారట. ఈ సినిమా షూటింగ్ దాదాపు వంద రోజులకు పైగానే జరపనున్నారట. మార్షల్ ఆర్ట్స్  - బాక్సింగ్ లతో కూడిన యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉండటం వల్ల భారీ టెక్నీషియన్స్ పనిచేస్తున్న మూలాన బెస్ట్ అవుట్ పుట్ కోసం షూటింగ్ డేస్ పెంచక తప్పట్లేదని చెబుతున్నారట పూరీ టీం. అయితే ఇందుకు కారణం బాలీవుడ్  నిర్మాత కరణ్ జోహార్ అని కూడా క్లియర్ గా తెలుస్తోంది. షూటింగ్ డేస్, పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ రోజులైన పరవాలేదు పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నాము కాబట్టి బెస్ట్ లో బెస్ట్ క్వాలిటీ ఉన్న సినిమా తీయాలని పూరి - చార్మీ వెంట జోరీగలా పడుతున్నారని టాక్. దాంతో సమ్మర్ కి రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా దసరాకి లేదా దీపావళి కి రిలీజ్ అవొచ్చు అన్న కొత్త టాక్ వినిపిస్తోంది.

 

పైగా ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ తర్వాత పూరి చేస్తున్న సినిమా కావడం మరో వైపు పూరి-విజయ్ ది క్రేజీ కాంబో కావడంతో సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే పూరి కి ఇలా అంచనాలు అందుకోవడం కొత్తేమీ కాదు. మహేష్, పవన్ కళ్యాణ్, నాగార్జున, అమితాబ్ లాంటి వాళ్ళతోనే తెరకెక్కించిన సినిమాలకి ఇంత టైం తీసుకోలేదు. మరి ఈ సారి ఎందుకిలా అంటూ పూరి ఫ్యాన్సే చెప్పుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: