టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక కొందరు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కలను బట్టి ఈ సినిమా ఇప్పటికే చాలా చోట్ల లాభాలు అందుకుందని తెలుస్తోంది. అయితే అమెరికాలో మాత్రం ఈ సినిమా కొంత దెబ్బతిన్నదని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

 

జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించడం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలకపాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని తన ఫ్యామిలీతో కలిసి అమెరికా, దుబాయ్ వంటి దేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్, మరొక రెండు నెలల్లో తిరిగి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో నటిస్తారు. దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. 

 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ పోర్ట్ ఏరియాలో జరిగే గ్యాంగ్ వార్ నేపథ్యంతో, ఈ సినిమాలో తన గ్యాంగ్ తో కలిసి పోర్ట్ వైజాగ్ పోర్ట్ ను శాసించే పవర్ఫుల్ డాన్ గా మహేష్ కనిపిస్తారని సమాచారం. అలానే మహేష్ పాత్రకు ఈ సినిమాలో మరొక షేడ్ కూడా ఉందనుందని, ఇక మహర్షి సినిమాకు పూర్తి భిన్నంగా మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుందని అంటున్నారు. ఎస్ ఎస్ థమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాని రాబోయే 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: