ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా ఇద్దరే రేస్ లో ఉన్నారు. ఇంచు మించు ఇద్దరూ దూసుకుపోతున్నారు. రెమ్యూనరేషన్ విషయంలోను ఇప్పుడు ఈ ఇద్దరే హాట్ టాపిక్. వాస్తవంగా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు టాప్ హీరోయిన్ పొజొషన్ లో ఒక్కరే ఉంటుంటారు. అప్పటి వరకూ ఎన్నో పెద్ద సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ అయినా అప్పుడే వచ్చిన ఇంకో హీరోయిన్ నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు చేయగానే అదే స్టార్ హీరోయిన్ స్టేటస్ ఈవిడ దక్కించుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్లేస్ లో ఇద్దరు బ్యూటీలు ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఏ సినిమా మొదలుపెడుతున్నా ముందు దర్శక నిర్మాతలు వీళ్ళని దాటి ముందుకు వెళ్ళడం లేదు. అయితే పూజా హెగ్డే లేదంటే రష్మిక మందన్న. చెప్పాలంటే సమంత పేరు కూడా అంతగా వినిపించడం లేదు.

 

అందరు హీరోలు ముందు పూజా హెగ్డే నే కావాలని అంటున్నారట. నాగ చైతన్య సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా 'డీజే' తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి. ఈ బక్కపలచని బ్యూటీ ప్రస్తుతం స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ గా మారింది. హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తూ యూత్ కి ఫేవరేట్ హీరోయిన్ గా మారిన  పూజా ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉంది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో పెద్ద సినిమా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల సంక్రాంతి వచ్చిన అల వైకుంఠపుర్రములో సినిమాతో పూజా బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమాలో నటిస్తోంది.

 

ఇక పూజా డేట్స్ ఏ మాత్రం అటు ఇటు అయ్యాయి అంటే మేకర్స్ కి నెక్స్ట్ ఛాయిస్ కన్నడ బ్యూటి రష్మిక మందన్ననే . ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బన్నీ తో సినిమా చేస్తుండటంతో ఇప్పుడు అందరి కన్ను రష్మికపై పడుతుంది. ఇదే స్పీడ్ తో మరో రెండు పెద్ద సినిమాలు చేస్తే రష్మిక ఓ ఐదేళ్ళ పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగడం పక్కా అనిపిస్తుంది. అయితే ఇప్పడ రెండు ఫ్లాపులు ఏ హీరోయిన్ కైనా స్టార్ హీరోయిన్ రేంజ్ నుంచి డమాల్ అంటు కింద పడేస్తాయి. మరి పూజా - రష్మిక ఎన్నాళ్ళు ఈ టాప్ ప్లేస్ లో కొనసాగుతారో చూడాలి. ఇక వాస్తవంగా ఈ ఇద్దరిని మేకప్ లేకుండా చూస్తే మాత్రం చీ..చీ..విళ్ళకింత డిమాండా అంటూ నోరెళ్ళ బెడతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: