ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోయిన్లలో రష్మిక మందనా టాప్ ప్లేస్ కు అటు ఇటుగా ఉంది. ఆమె క్రేజ్ కు తగ్గట్టుగానే సినిమాలు కూడా లైన్ ఓ ఉంటున్నాయి. రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో రష్మిక గోల్డెన్ లెగ్ అని ప్రూవ్ అయిపోయింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో AA20తో రష్మికనే హీరోయిన్. ఎన్టీఆర్ తో సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ అనే వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ప్రూవ్ అయిన రష్మిక టాలెంట్ ప్రస్తుతం కోలీవుడ్ పై కూడా పడింది.

 

 

కార్తీతో చేస్తున్న సుల్తాన్ మూవీ త్వరలో విడుదల కానుంది. విజయ్ సరసన కూడా అవకాశం వచ్చేట్టుందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం అమ్మడికి కోలీవుడ్ లో ఓ బంపర్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన ఓ సినిమా కమిట్ అయిందనేది లేటెస్ట్ టాక్. స్టార్ డైరక్టర్ హరి దర్శకత్వంలో సూర్య హీరోగా సింగం4 ను తెరకెక్కిస్తున్నట్టు టాక్. ఇందులో రష్మికనే ఫైనల్ చేశారని అంటున్నారు. ఈ వార్త నిజమైతే రష్మిక దశ కోలీవుడ్ లోనూ తిరిగినట్టే. సుల్తాన్ సినిమా రిలీజ్ కాకుండానే సూర్య సినిమాలో ఆఫర్ రావడమంటే రష్మిక టాలెంట్ ను గుర్తించినట్టే.

 

 

కన్నడ నుంచి టాలీవుడ్ కి వచ్చిన రష్మికకు ఇంతటి మహర్దశను ఊహించి ఉండదు. ఏకంగా టాలీవుడ్ ను కోలీవుడ్ ను రౌండ్ చేసేస్తోంది. గతంలో త్రిష, నయనతార కూడా ఇలానే టాలీవుడ్, కోలీవుడ్ ను ఏకకాలంలో ఏలేశారు. ప్రస్తుతం రష్మిక పరిస్థితి అలానే ఉంది. కోలీవుడ్ లో ఓ సినిమా హిట్ అయితే ఇక రష్మికను పట్టుకోవడం కష్టమే మరి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: