టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా టాలీవుడ్ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్, అనతి కాలంలోనే మంచి విజయాలు అందుకుని టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించడంతో పాటు పవర్ స్టార్ గా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన నటించిన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి బాగానే ఆడింది. ఆ తరువాత వచ్చిన సుస్వాగతం, గోకులంలో సీత, తొలిప్రేమ సినిమాలు మంచి విజయాలు అందుకుని పవన్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ని తీసుకురావడం జరిగింది. ఆ తరువాత ఆయన నటించిన బద్రి మరొక హిట్ అందుకోగా, ఆపై ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా పవన్ పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టింది. 

 

అయితే  ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న పవన్, తన సొంత డైరెక్షన్ లో జానీ సినిమా తీయగా అది ఫ్లాప్ అయింది. ఇక అక్కడినుండి మధ్యలో ఒక్క జల్సా తప్ప, దాదాపుగా పదేళ్ళపాటు పవన్ కు ఆశించిన రేంజ్ విజయం అయితే లభించలేదు. కాగా ఆ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 2012లో పవన్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో అతి పెద్ద హిట్ గా నిలిచి పవన్ బాక్సాఫీస్ పవర్ ని మరొక్కసారి రుజువు చేసింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న పవన్ కు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది మరొక సూపర్ డూపర్ హిట్ ని అందించి ఆయన స్టామినాని మరొకసారి రుజువు చేసింది. 

 

ఇక రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ తో ఆయన చేసిన అజ్ఞాతవాసి మాత్రం ఫ్లాప్ అవడం జరిగింది. ఇక ఆ తరువాత పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిన పవన్, మళ్ళి రెండేళ్ల తరువాత ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లోనటిస్తున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దాని తరువాత ఆయన నటించబోయే రెండు సినిమాల్లో ఒకటి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, మరొకటి గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలు కూడా తప్పకుండా మంచి విజయాలు అందుకుంటాయని, ఆయనకు టైం గ్యాప్ వచ్చిందేతప్ప, హిట్స్ కొట్టే టైమింగ్ లో కాదని అంటున్నారు ఆయన ఫ్యాన్స్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: