పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దాదాపుగా రెండేళ్ల తరువాత మళ్ళి ముఖానికి మేకప్ వేసుకున్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ అయిన పింక్ అధికారిక రీమేక్ లో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన పవన్ కళ్యాణ్, అక్కడి నుండి తన టాలెంట్ తో మంచి సక్సెస్ లు అందుకుంటూ వరుసగా విజయాలతో దూసుకుపోయారు. ముందుగా చిరంజీవి సోదరుడిగా టాలీవుడ్ కి పరిచయం అయిన పవన్, అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకుని పవర్ స్టార్ అనే బిరుదుని పొందారు. 

 

ఇక పవన్ తనను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతకైనా, అలానే ఎందాకైనా వెళ్తారు అనేది ఇప్పటివరకు పలు సందర్భాల్లో తేటతెల్లం అయింది. ఆయనతో సినిమాలు చేయడానికి వచ్చే దర్శకుడి ట్రాక్ రికార్డు పెద్దగా పట్టించుకోని పవన్, అతడి కథ నచ్చితే చాలు తప్పకుండా సినిమా చేస్తారు. అంతేకాక ఎంతో పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఆ సినిమా కోసం ఎంత కష్టం అయినా పడడానికి పవన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పలువురు దర్శకులు ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. ఇక రెండేళ్ల క్రితం అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో పవన్ నటిస్తున్న పింక్ రీమేక్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 

ఇక దాని తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న పవన్, ఆపై హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. నిజానికి గతంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఒక సినిమా చేయాల్సి ఉన్న పవన్, అజ్ఞాతవాసి తరువాత రాజకీయాల్లో పూర్తిగా బిజీ కావడంతో ఆయనకు వారి సినిమా చేయడానికి వీలుపడలేదు. ఇక ఎట్టకేలకు మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంతో హరీష్ శంకర్ సినిమాని వారి బ్యానర్ పై చేయడానికి సిద్ధం అయ్యారు పవన్. మరి  సినిమాలు ఆయనకు ఎంత మేర విజయాలు అందిస్తాయో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: