ఈ మద్య టాలీవుడ్ లో కుర్ర హీరోలు ఒక్కొక్కరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా చెప్పుకుంటున్న నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇదే బాటలు హ్యాపీడేస్ మూవీతో హీరోగా పరిచయం అయి.. మొన్నటి అర్జున్ సురువరం వరకు తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు నిఖిల్ భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవితో నిఖిల్ ఐదేళ్లగా ప్రేమలో ఉన్నారు. గోవాలో పల్లవికి తన ప్రేమను వ్యక్తం చేశారు నిఖిల్. అదే ప్రాంతంలో పెద్దల సమక్షంలో శనివారం నిశ్చితార్థం కూడా జరిగింది. ఏప్రిల్ 16న వీరిద్దరూ వివాహబంధంతో ఒకటి కానున్నారు. ఇప్పుడు మరో యువ హీరో పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యారు.. కాకపోతే ఆ పెళ్లి కూతురు ఎవరో.. ఎలా ఉండాలో అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో శర్వానంద్ ఒకరు. వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నఈ కుర్ర హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సాధారణంగా మీ పెళ్లెప్పుడు అని అడిగితే సమాధానం దాటవేసే శర్వానంద్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి మాట్లాడుతూ తనకు మజిలీలో సమంతలాంటి అమ్మాయి భార్యగా దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. రిలీ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా చైతూ-సమంతలు భార్యభర్తలు. ఈ మూవీలో చైతూ భార్యగా సమంత నటించింది అనేకన్నా జీవించింది అని చెప్పొచ్చు.
అయితే ఈ మూవీలో నాగ చైతన్య ఎంత ఇబ్బంది పెట్టినా.. ఎంతో ఓర్పు, సహనంతో ఉంటుంది. అంతే కాదు భర్తను బాగా చూసుకుంటుంది కదా అందుకనే అని సమాధానం చెప్పాడు. మరి అలాంటి అమ్మాయి శర్వానంద్కు దొరుకుతుందో లేదో చూడాలి. మొత్తానికి అలాంటి భార్య ఏ భర్త అయినా కోరుకుంటారు.. మరి ఈ హీరో కూడా తన మనసులో మాట అలా చెప్పుకున్నాడు. శర్వానంద్, సమంత నటించిన ‘జాను’ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.