టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిమిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ మూవీ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. అలానే మెగా, నందమూరి స్టార్ హీరోలు ఇద్దరూ కూడా మొదటి సారి కలిసి వెండితెరపై కనిపించనుండడంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. 

 

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించి నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వస్తున్న ఒక న్యూస్, అటు బాలీవుడ్ ని కూడా షేక్ చేస్తోంది. అదేమిటంటే ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అలానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కానున్నారట. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా తెలుగు వర్షన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, అలానే హిందీ వెర్షన్ కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ విషయమై కొద్దీరోజుల క్రితం సదరు ఈ స్టార్ హీరోలిద్దరినీ విడివిడిగా కలిసిన రాజమౌళి, వారు సుముఖత వ్యక్తం చేయడంతో అతి త్వరలో వారితో వాయిస్ ఓవర్ ఇప్పించనున్నట్లు టాక్. 

 

అయితే మహేష్ ప్రస్తుతం విదేశాల్లో టూర్ చేస్తుండడంతో ఆయన తిరిగి వచ్చిన వెంటనే ఆ పని మొదలెడతారని, ఈలోపు హిందీ వర్షన్ కు అమితాబ్ తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తారని అంటున్నారు. అలానే తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్స్ కు కూడా అక్కడి స్టార్ హీరోలతో కూడా రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక ఈ విషయం కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అయిందని, కాకపోతే దీనిపై ఆర్ఆర్ఆర్ యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావడం మాత్రమే రావలసి ఉందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే, సినీ లవర్స్ కి ఇది మంచి పండగ వార్తే అని చెప్పవచ్చు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: