పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన క్రేజే వేరు. ఈ మధ్య ఈయన సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. జనసేన అనే ఓ పార్టీ పెట్టి. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటూ పవన్ ముందుకు వెళుతున్నారు. ఇక ఇదిలా ఉంటే... ఆయన ప్రస్తుతం తిరిగి పింక్ రీమేక్ చిత్రంతో మళ్ళీ తెర మీద కనిపించబోతున్నారు. ఈ సంవత్సరం ఒకేసారి నాలుగు చిత్రాలతో ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. ఇక పింక్ రీమేక్ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. అయితే టాలీవుడ్లో ఉన్న చాలా మంది హీరోయిన్లు పవన్తో నటించాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి ఆయనతో నటించే అవకాశం ఉన్నా చాలా అనుకునే హీరోయిన్లు అప్పట్లో చాలా మందే ఉన్నారు. వీళ్ళలో ఇలియానా, సమంత, కాజల్, ఇలా చాలా మందే చెప్పేవారు. వీళ్ళంతా ఆల్రెడీ పవన్తో కలిసి నటించిన హీరోయిన్లే.
ఇక పవన్ తో కలిసి ఒక్క సినిమాలో కూడా నటించని వారు చాలామందే ఉన్నారని చెప్పాలి. వాళ్ళలో అనుష్క, నయనతార పవన్తో కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇక తమన్నా అయితే పవన్తో కలిసి గంగతోరాంబాబు చిత్రంలో నటించింది. పవన్తో కలిసి నటించడం అప్పట్లో తన అదృష్టంగా భావిస్తున్నానని తమన్నా చెప్పింది. అలాగే గతంలో చాలామంది హీరోయిన్లే పవన్తో నటించడానికి ఇంట్రస్ట్ చూపించేవారు.
ప్రస్తుతం ఆయన నటించే మిగతా మూడు చిత్రాల్లో హీరోయిన్లు ఇంకా కన్ఫర్మ్ కావాల్సిన అవసరం ఉంది. దానికోసం చాలామంది హీరోయిన్లే లైన్లో వెయిట్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్న జనరేషన్ హీరోయిన్స్తో ఆయన కేవలం ఇద్దరితోనే నటించారు. అది అనుఇమాన్యూల్, కీర్తిసురేష్ వీరిద్దరితో అజ్ఞాతవాసిలో నటించారు. అలాగే అప్పట్లో గోకులంలో సీత ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ రాశి. ఈమె ఇటీవలె ఓ ఇంటర్యూలో పవన్ గురించి ఆయనను తను ఇటీవలె కలిశానని ఆయన అప్పుడు ఎలాగైతే ప్రవర్తించేవారో ఇప్పటికీ అలనే అంతే ఆప్యాయతతో ఉండేవారని ఆమె చెప్పారు. అందుకే హీరోయిన్స్ పవన్తో కలిసి నటించడానికి అంత ఇష్టపడతారు.