పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రావడం ఆలస్యం.. దర్శకులకు కొత్త ఎనర్జీ వస్తోంది. పవర్ స్టార్ తో కలిసి పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ తీయాలని దర్శకులు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. జనసేనాని కోసం కొత్త కొత్త కథలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే పవన్ కోసం అయిదుగురు దర్శకులు ఎదురుచూస్తున్నారు. 

 

పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. ఇందులో రెండు సినిమాలు ఆల్ రెడీ లాంచ్ అయ్యాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ అయితే షూటింగ్ లో ఉంది. ఈ మూవీని సమ్మర్ కు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా డిస్కషన్స్ లో ఉండగానే క్రిష్ దర్శకత్వంలోనూ ఓ మూవీకి సైన్ చేశాడు పవన్. 


పవన్ కళ్యణ్ పొలిటికల్ ఇమేజ్ కు సెట్ అయ్యేలా క్రిష్ ఓ పవర్ ఫుల్ పీరియాడికల్ డ్రామా డిజైన్ చేశాడనే ప్రచారం జరుగుతోంది. బ్రిటీష్ పాలకులు దోచుకున్న సొమ్ముని, తిరిగి పేదలకు దోచిపెట్టే రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపిస్తాడనే టాక్ వస్తోంది. ఈ మూవీ రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 


పవన్ కళ్యాణ్ ఫ్లాపుల గాడి నుంచి బయటపడేసిన సినిమా గబ్బర్ సింగ్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ ను ఫుల్ గా ఎంటర్ టైన్ చేసింది. దీంతో పవన్, హరీశ్ కాంబినేషన్ కు బాక్సాఫీస్ దగ్గర బోల్డంత క్రేజ్ వచ్చింది. ఈ క్రేజీ కాంబినేషన్ నే రిపీట్ చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ పవర్ ప్యాక్డ్ ఎంటర్  టైనర్ తెరకెక్కిస్తున్నారు. 

 

పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏడాదికి ఒక సినిమా అన్నట్టుగానే కాల్షీట్లు ఇచ్చేవాడు. అయితే ఈ కమ్ బ్యాక్ లో మాత్రం దూకుడు పెంచాడు. ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేసి, మరో రెండు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. ఈ రెండేళ్ల గ్యాప్ ని ఇప్పుడు కవర్ చేసేందుకు పరుగులు పెడుతున్నాడు పవన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: